SUICIDE : విషాదం... వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య

author img

By

Published : Sep 18, 2021, 12:06 AM IST

వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య

కడప నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదన్న కారణంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరో ఘటనలో అనుమానాస్పద స్థితిలో చీరకు ఉరి వేసుకుని ఓ వ్యక్తి మృతి చెందాడు.

కడప శంకరాపురం ప్రాంతానికి చెందిన వంశీకృష్ణకు ఫేస్​బుక్ ద్వారా హైదరాబాద్​కు చెందిన యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయాన్ని వంశీకృష్ణ తన తల్లిదండ్రులకు తెలిపాడు. వీరి ప్రేమ విషయాన్ని వారు ఒప్పుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కడప శివారులోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యం... ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. ఈ రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

మిస్ యూనివర్స్ సింగపూర్‌గా తెలుగు యువతి నందిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.