ETV Bharat / city

గురజాలలోని మదర్సాలో కలుషిత ఆహారం తిని విద్యార్థి మృతి

author img

By

Published : Jul 16, 2022, 2:05 PM IST

Updated : Jul 16, 2022, 3:13 PM IST

కలుషిత ఆహారం తిని విద్యార్థి మృతి
కలుషిత ఆహారం తిని విద్యార్థి మృతి

14:04 July 16

కలుషిత ఆహారం తిని విద్యార్థి మృతి

కలుషిత ఆహారం తిని విద్యార్థి మృతి

పల్నాడు జిల్లా గురజాలలోని.. ఓ మదర్సాలో విషాదం చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం చేశాక మున్నా అనే బాలుడు మృతిచెందాడు. మదర్సాలో ఉండే విద్యార్థులకు.. వేర్వేరు ప్రాంతాల నుంచి దాతలు ఆహారం అందిస్తుంటారు. ఈ క్రమంలోనే ఓ శుభకార్యం నుంచి మదర్సాకు.. ఇవాళ ఆహారం వచ్చింది. అది తిన్న తర్వాత 11మంది విద్యార్థులు.. అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే గురజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారిలో మున్నా అనే బాలుడు మరణించగా.. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురిని... పిడుగురాళ్ల ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులు తిన్న ఆహారాన్ని పరీక్షల కోసం పంపిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

వరదలపై సీఎం జగన్ సమీక్ష.. మరో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం

గోదావరి మహోగ్రరూపం..అల్లాడిపోతున్న జనం

Last Updated :Jul 16, 2022, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.