Janasena: రాజు మారినప్పుడల్లా.. రాజధాని మారదు: నాదెండ్ల మనోహర్​

author img

By

Published : Sep 11, 2022, 5:32 PM IST

nadendla

Nadendala Manohar on farmers padayatra: రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని జనసేన నేత నాదెండ్ల మనోహర్​ అన్నారు. ఒక రాజధానినే కట్టలేని జగన్..​ మూడు రాజధానులను ఎలా కడతారని ప్రశ్నించారు. రాజధాని రైతుల పాదయాత్రకు జనసేన మద్దతు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు.

Janasena Support to Capital Farmers padayatra: రాజధాని రైతుల మహా పాదయాత్ర-2కు జనసేన మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో మాట్లాడిన మనోహర్... ఆంధ్రప్రదేశ్​ రాజధాని అమరావతి మాత్రమేనని స్పష్టం చేశారు. రాజు మారినప్పుడల్లా రాజధాని మారదని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రైతులు ఎక్కడా సంతోషంగా లేరని అభిప్రాయపడ్డారు. గతంలో తిరుమల పాదయాత్రకు మద్దతిచ్చామని.. ఇప్పుడు అరసవల్లి పాదయాత్రకు జనసేన కార్యకర్తలు అండగా ఉండాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారని తెలిపారు. అమరావతి రైతులతో 10నిమిషాలు మాట్లాడే తీరిక ముఖ్యమంత్రికి లేకపోయిందని ఎద్దేవా చేశారు. రైతులకు భయపడి రాజధాని ప్రాంతాల్లో పరదాలు కట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక రాజధానే కట్టలేని జగన్.. మూడు రాజధానులు కడతారా అని ప్రశ్నించారు.

Amaravati Maha Padayatra: సోమవారం గుంటూరు జిల్లా వెంకటపాలెంలో మొదలు కానున్న అమరావతి మహాపాదయాత్ర. సరిగ్గా రెండు నెలల తర్వాత నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ముగియనుంది. అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అమరావతిపై జరుగుతున్న కుట్రను ప్రజలకు వివరించడంతోపాటుగా.. పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తామని రైతులు చెబుతున్నారు. 12 పార్లమెంట్, 45అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగే యాత్రలో.. మోపిదేవి, ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం పుణ్యక్షేత్రాలను దర్శించుకోనున్నారు. అలాగే ఈసారి జాతీయ రహదారుల వెంట కాకుండా పల్లెలు, పట్టణాల ద్వారా నడిచేలా రైతులు రూట్‌మ్యాప్‌ రూపొందించారు. యాత్రకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, వివిధ కమిటీలు సమన్వయం చేసేలా ప్రణాళిక తయారు చేశారు.

సోమవారం వెంకటపాలెంలో మొదలయ్యే యాత్ర.. కృష్ణాయపాలెం, పెనుమాక, ఎర్రబాలెం మీదుగా మంగళగిరికి చేరుకోనుంది. కృష్ణాయపాలెం వద్ద యాత్రలో పాల్గొనున్న తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రైతులకు సంఘీభావం తెలపనున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు రాజధాని అమరావతి 29 గ్రామాలకే పరిమితం కాదని, యావత్తు రాష్ట్ర ప్రజల సొత్తు అని ఐకాస నాయకులు, రైతులు స్పష్టంచేస్తున్నారు. అమరావతిపై వచ్చే ఆదాయాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి వినియోగించాలని తాము కోరుతున్నట్లు తెలిపారు. దీనిపై విషప్రచారం చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.