ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM

author img

By

Published : Jul 3, 2022, 12:59 PM IST

TOP NEWS
ప్రధాన వార్తలు

.

  • ప్రజల ఆవేదన నుంచే పరిష్కారాలు పుట్టుకొస్తాయి: పవన్ కల్యాణ్
    Pawan Kalyan: ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక పాలకులకు లేదని.. ఆలోచన ఉంటే ప్రజల ఆవేదన నుంచే పరిష్కారాలు పుట్టుకొస్తాయని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నేతలు అధికారం ఉంటేనే సమస్యల పరిష్కారం అంటే కుదరదని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దారుణహత్య
    MURDER: సంగారెడ్డి జిల్లా జిన్నారంలో దారుణం జరిగింది. కేపీహెచ్‌బీ పరిధిలో అదృశ్యమైన యువకుడు దారణహత్యకు గురయ్యాడు. ప్రేమపెళ్లి చేసుకున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నారాయణరెడ్డిని యువతి తరఫు బంధువులు చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నారాయణరెడ్డిని హత్య చేసి నిప్పుపెట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • CM Jagan: హర్ష నిన్ను చూసి గర్వపడుతున్నా.. సీఎం జగన్ ట్వీట్
    CM Jagan: ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటన ముగిసింది. ప్యారిస్ నుంచి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీఎం జగన్ చేరుకున్నారు. జగన్ కుమార్తె హర్షా రెడ్డి ప్యారిస్‌లో చదువుతుండగా.. తన స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు అక్కడకు వెళ్లారు. అనంతరం తన ఎదుగుదలను చూసి గర్విస్తున్నట్లు ట్విటర్​ ద్వారా తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • SUICIDE: చెరువులో దూకి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య.. కారణమేంటి..?
    SUICIDE: చిల్లకల్లులోని ఓ చెరువులో దూకి సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. వర్క్​ ఫ్రం హోమ్​ తర్వాత ఉద్యోగంలో చేరేందుకు ఆదివారం సాయంత్రం మంగళగిరి నుంచి తల్లిదండ్రులతో కలసి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వచ్చిన శ్వేత.. రాత్రి 8 గంటల సమయంలో చనిపోతున్నట్లు తన తల్లిదండ్రులకు వాట్సప్​లో సందేశం పంపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'మహా' స్పీకర్​గా భాజపా నేత.. శివసేన కార్యాలయానికి సీల్!
    Maharastra Politics: శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలో ఏర్పడిన మహారాష్ట్ర ప్రభుత్వం బల నిరూపణకు సిద్ధమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో విధాన్​భవన్​లోని శాసనసభాపక్ష కార్యాలయాన్ని సీల్​ చేశారు శివసేన నేతలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఉగ్రవాదులను పట్టుకున్న కశ్మీరీలు.. పోలీసులకు అప్పగింత.. గవర్నర్ భారీ నజరానా
    జమ్ముకశ్మీర్​లో.. లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను గ్రామస్థులు పట్టుకుని.. పోలీసులకు అప్పగించారు. గ్రామస్థుల ధైర్య సాహసాలు మెచ్చి రాష్ట్ర లెఫ్టినెంట్​ గవర్నర్​​, డీజీపీ భారీ నజరానా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 29వ అంతస్తు నుంచి కిందపడ్డ మూడేళ్ల బాలుడు.. కొద్దిసేపు ఏడ్చి.. కాసేపటికే..
    Boy fell from apartment: మూడేళ్ల బాలుడు భవనం 29వ అంతస్తులోని కిటికీ నుంచి కిందపడ్డాడు. అమెరికాలోని న్యూయార్క్​లో జరిగిందీ ఘటన. ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలుడు మృతి చెందాడని వైద్యులు నిర్ధరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మార్కెట్లు క్రాష్: ఆ ఒక్కటి చూసి షేర్లు కొనొద్దు.. ఈ జాగ్రత్తలు మస్ట్!
    stock market losses: రష్యా- ఉక్రెయిన్‌ పరిణామాలు, అధిక చమురు, కమొడిటీల ధరలు, విదేశీ మదుపర్లు భారీగా పెట్టుబడుల ఉపసంహరణ ప్రభావంతో కొన్ని నెలలుగా దేశీయ స్టాక్‌ మార్కెట్లలో దిద్దుబాటు కొనసాగుతోంది. సెన్సెక్స్‌, నిఫ్టీలు ఈ ఏడాదిలో ఇప్పటికే 10 శాతం మేర నష్టపోయాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అండర్సన్​​పై జడ్డూ కామెంట్స్​ వైరల్​.. వీరిద్దరి మధ్య గొడవ ఏంటి?
    Ravindra Jadeja Anderson: 2014 తర్వాత ఇంగ్లాండ్​ ప్లేయర్​ అండర్సన్​కు ఇప్పుడు జ్ఞానోదయం కలిగిందని అన్నాడు టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా. ఎందుకు అన్నాడంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • నరేశ్​-పవిత్రతో తగాదా పడిన రమ్య.. చెప్పుతో కొట్టేందుకు యత్నం!
    Naresh Pavitra lokesh relation: ఓ హోటల్​లో బస చేస్తున్న తన భర్త​-పవిత్రా లోకేష్​ దగ్గరకు వెళ్లి తగాదా పడ్డారు నరేశ్​ భార్య రమ్య రఘపతి. ఈ క్రమంలోనే ఆమె పవిత్రను కొట్టబోయారని తెలిసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.