- రాత్రిపూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం ఏం సమాధానం చెబుతారు: చంద్రబాబు
Chandrababu: తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని.. తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. రాత్రిపూట కూల్చివేతలపై కోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని.. ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- DIED: నీటిలో మునిగి పెద్దకోట్ల గ్రామ వీఆర్వో మృతి..
DIED: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పీఏబీఆర్ జలాశయంలో మునిగి ఓ వీఆర్వో మృతి చెందారు. అనంతపురానికి చెందిన నూర్ మహమ్మద్.. తాడిమర్రి మండలం పెద్దకోట్ల గ్రామ వీఆర్వోగా పనిచేస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- Father's Day: నాన్నతో కలిసి కుమార్తెల క్యాట్వాక్..
Father's Day: తండ్రుల దినోత్సవం సందర్భంగా ఆదివారం వైజాగ్ ఎక్స్పో ప్రాంగణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా తండ్రులతో కలిసి కుమార్తెలు క్యాట్వాక్ నిర్వహించడం ఆకట్టుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- BIRTHDAY CELEBRATIONS: ఆరని తండ్రి.. కంట తడి
BIRTHDAY CELEBRATIONS: ఆ తండ్రికి ఆడపిల్ల పుడితే లక్ష్మిదేవి పుట్టిందని మురిసిపోయాడు. పుట్టిన దగ్గరనుంచి గుండెల మీద పెట్టుకొని గారాబం చేశాడు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పుట్టిన ఎనిమిది సంవత్సరాల తర్వాత బ్లడ్ క్యాన్సర్తో మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు మరణించడంతో ఆ తండ్రి ఆవేదన వర్ణనాతీతం. కూతురు పుట్టినరోజు సందర్భంగా కుమార్తె త్రీడీ ఫొటో పెట్టి ఆమె అందరి మధ్య ఉన్న భావనను కల్పిస్తూ ఘనంగా వేడుకలు జరిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- భర్తతో నిద్రిస్తున్న మైనర్పై గ్యాంగ్రేప్.. కత్తితో బెదిరించి..!
భర్తతో డాబాపై నిద్రపోతుండగా ఐదుగురు యువకులు కత్తితో బెదిరించి మైనర్ భార్యపై అత్యాచారం చేసిన ఘటన రాజస్థాన్ అల్వార్లో జరిగింది. మరో ఘటనలో పదేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రెండో రోజు కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష.. దిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా పలు సంఘాలు.. భారత్ బంద్కు పిలుపునివ్వడం వల్ల దిల్లీలో ట్రాఫిక్ భారీగా స్తంభించపోయింది. వేలకొలది వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. మరోవైపు, కాంగ్రెస్ నాయకులు రెండో రోజు.. జంతర్మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. సోమవారం రాహుల్ గాంధీ ఈడీ ముందు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'అగ్నివీరుల'కు ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్
Anand Mahindra Offer: త్రివిధ దళాల నియామకాల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న వేళ.. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. హింసాత్మక ఆందోళనలు విచారకరమని అన్నారు. ట్విట్టర్ వేదికగా అగ్నివీరులకు ఓ బంపర్ ఆఫర్ కూడా ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయిన మెక్రాన్
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికై రెండు నెలలు కూడా గడవకముందే.. మెక్రాన్కు గట్టి షాక్ తగిలింది. జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో మెక్రాన్ కూటమి మెజారిటీని కోల్పోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రుతురాజ్, మెద్వెదేవ్పై ఫ్యాన్స్ ఫైర్.. అలా చేయడమే కారణం!
టీమ్ఇండియా ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్, రష్యన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ నంబర్ 1 ఆటగాడు మెద్వెదేవ్పై నెటిజన్లు మండిపడుతున్నారు. మైదానంలో వారు వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏం జరిగిందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాలయ్య 'అన్స్టాపబుల్' సీజన్-2 రెడీ.. ఫ్యాన్స్లో ఫుల్ జోష్
Unstoppable with NBK talk show: ఓటీటీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది బాలకృష్ణ 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' టాక్ షో. ఇటీవలే తొలి సీజన్ పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం రెండో సీజన్కు సన్నద్ధమవుతోంది. అయితే తాజాగా ఈ రెండో సీజన్ ప్రారంభంపై అప్డేట్ ఇచ్చింది ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.