ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM

author img

By

Published : Jan 8, 2022, 1:01 PM IST

.

TOP NEWS
TOP NEWS

  • rgv: 'నన్ను ఆహ్వానించినందుకు మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు'

సినిమా టికెట్ల వ్యవహారం రసవత్తరంగా మారుతోంది. ఇటీవల ట్విట్టర్​లో మంత్రి పేర్నినాని, రాంగోపాల్ వర్మల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని...దర్శకుడు రాంగోపాల్ వర్మను చర్చలకు ఆహ్వానించారు. ఈ మేరకు స్పందించిన ఆర్జీవీ తనను ఆహ్వానించినందుకు మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సీఎం కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డితో.. నేడు ఉద్యోగ సంఘాల భేటీ

సీఎం కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డితో నేడు ఉద్యోగ సంఘాలు సమావేశం కానున్నాయి. ఇంటి అద్దెభత్యంపై సీఎం కార్యదర్శితో చర్చించి.. తుది నిర్ణయానికి రానున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • two died in road accident: రెండు ద్విచక్రవాహనాలు ఢీ.. ఇద్దరు మృతి

కృష్ణా జిల్లాలోని చెవురుపాలెం సెంటర్‌ వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా.. ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తివివరాలకు క్లిక్ చేయండి

  • Latest Trends in Cybercrime: 5 సెకన్లు నగ్నంగా కనిపిస్తారు.. చూశారంటే ఇక అంతే..!

సైబర్‌ మోసాల కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. కొత్త కొత్త ఎత్తులతో నేరగాళ్లు అమాయకులను నిండా ముంచుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ వినియోగం పెరగటంతో.. వాడకంపై అవగాహన సరిగా లేని వాళ్లను ఆసరాగా చేసుకుంటూ కొత్త మార్గాల్లో గాలం వేస్తున్నారు. ఇప్పటి వరకు 'ఈ-​మెయిల్‌', మెసేజ్‌ల ద్వారా బురిడీ కొట్టించిన కేటుగాళ్లు.. ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నారు. నగ్న వీడియోలు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలనే ప్రకటనలతో నిండా ముంచుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మధ్యాహ్నం 3:30 గంటలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

త్వరలో జరిగే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్​ను శనివారం మధ్యాహ్నం విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • భాజపా ఎమ్మెల్యే చెంప చెళ్లుమనిపించిన రైతు.. ఏమైందంటే?

ఉత్తర్​ప్రదేశ్, ఉన్నావ్​లో భాజపా ఎమ్మెల్యే పంకజ్ గుప్తాపై ఓ రైతు చేయిచేసుకున్నాడు. సభలో అందరు చూస్తుండగా స్టేజీపైకి వచ్చి గుప్తా చెంప చెళ్లుమనిపించాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'మోదీ పంజాబ్​ సభ'కు సమీపంలో పాకిస్థాన్​​ బోట్​!

ప్రధాని మోదీ పంజాబ్​లోని ఫిరోజ్​పుర్​ సభకు వెళ్తూ భద్రతా లోపం కారణంగా ఆకస్మికంగా పర్యటన ముగించారు. ఆ ప్రాంతానికి సమీపంలోనే తాజాగా.. పాకిస్థాన్​కు చెందిన ఓ బోట్​ను బీఎస్​ఎఫ్​ సిబ్బంది శనివారం సీజ్​ చేశారు. సభా ప్రాంగణానికి సమీపంలోనే పాక్​ బోట్​ ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ట్యాక్స్​ కడితే.. రూ.55వేల కోట్ల డీల్​లో 40% షేర్ ఇస్తాం'- మహిళకు టోకరా!

'ఆర్​బీఐ వద్ద రూ.55వేల కోట్లు ఫ్రీజయ్యాయి. ట్యాక్స్​ కట్టేందుకు రూ.27 కోట్లు కావాలి. ఆ నగదు సమకూరుస్తే 40 శాతం షేర్​ ఇస్తాం' అని నమ్మించి ఓ మహిళను మోసం చేశారు కొందరు దుండగులు. ఈ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలో జరిగింది. ఈ కేసులో నలుగురిని అరెస్ట్​ చేశారు పోలీసులు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కోహ్లీపై వ్యంగ్యాస్త్రాలు.. ఓ వెబ్​సైట్​కు జాఫర్ కౌంటర్

టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వసీమ్ జాఫర్ ఆస్ట్రేలియా క్రికెట్​ వెబ్​సైట్​కు కౌంటర్​ ఇచ్చి వార్తల్లో నిలిచాడు. కోహ్లీ రెండేళ్ల ప్రదర్శనపై ఓ వెబ్​సైట్ ట్వీట్ చేయగా.. అదే రీతిలో వారికి స్మిత్ సగటు గురించి ట్వీట్ చేసి గట్టి బదులిచ్చాడు జాఫర్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కరోనాతో గుర్తుపట్టలేనంతగా మారిపోయా: దీపిక

కరోనా సోకినప్పుడు తనకు ఎదురైన అనుభవాలను తెలిపారు బాలీవుడ్​ హీరోయిన్​ దీపికా పదుకొణె. వైరస్​ నుంచి కోలుకున్నాక తాను గుర్తుపట్టలేనంతగా మారిపోయానని, మెదడు కూడా సరిగా పనిచేయలేదని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.