AP CORONA: రాష్ట్రంలో కొత్తగా 540 కరోనా కేసులు.. 10 మరణాలు

author img

By

Published : Oct 14, 2021, 4:16 PM IST

Updated : Oct 14, 2021, 5:06 PM IST

రాష్ట్రంలో కొత్తగా 540 కరోనా కేసులు

16:12 October 14

రాష్ట్రంలో కొత్తగా 540 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 540 కరోనా కేసులు
రాష్ట్రంలో కొత్తగా 540 కరోనా కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40,350 పరీక్షలు నిర్వహించగా.. 540  కేసులు నిర్ధారణ(ap corona cases) అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,59,122 మంది వైరస్‌ బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ(ap corona updates) వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ కారణంగా 10 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,588 యాక్టివ్‌ కేసులున్నాయి. 

 కరోనా వైరస్ బారినపడి ప్రకాశం జిల్లాలో ముగ్గురు చనిపోగా.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. తూర్పుగోదావరి, కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. చిత్తూరు జిల్లాలో 120, గుంటూరు జిల్లాలో 111 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,88,79,945 నమూనాలు పరీక్షించినట్లు  ఆరోగ్య శాఖ(ap corona bulletin) వెల్లడించింది.

ఇదీ చదవండి..

Covid cases in India: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

Last Updated :Oct 14, 2021, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.