ETV Bharat / city

ముహూర్తం ఎందుకు.. ఎప్పుడొచ్చినా నేను సిద్ధమే: అయ్యన్నపాత్రుడు

author img

By

Published : Jun 25, 2022, 1:56 PM IST

AYYANNA
AYYANNA

AYYANNA: "నేను అజ్ఞాతంలో ఉన్నానని విజయసాయిరెడ్డి అంటున్నారు.. కానీ నేను నర్సీపట్నంలోనే ఉన్నాను" అని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. తనకు తాను పులిని అనుకుంటున్న విజయసాయి రెడ్డి.. పోలీసులతో కాకుండా సింగిల్‌గా వస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.

AYYANNA: బెయిల్ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడానికి దిల్లీ వెళ్లిన విజయసాయిరెడ్డి.. తనను విమర్శించడం విడ్డూరంగా ఉందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. తాను అజ్ఞాతంలో ఉన్నానడం అవాస్తవమని.. నర్సీపట్నంలోనే ఉన్నానని తెలిపారు. విజయసాయిరెడ్డి ఎప్పుడొచ్చినా తాను సిద్దమేనని.. దీనికి ముహూర్తమెందుకని ప్రశ్నించారు.

  • అంత గొప్పగా ఉంది నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ. నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేను
    రెఢీ. అన్నట్టు పులి అయితే పోలీసుల్ని వేసుకొని రాదుగా సింగిల్ గా రావాలి. అప్పుడు తేలిపొద్ది ఎవడు పులో ఎవడు పిల్లో!. 2/2@VSReddy_MP

    — Ayyanna Patrudu (@AyyannaPatruduC) June 25, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విజయసాయి రెడ్డి పులి అయితే.. పోలీసుల్ని వేసుకొని రాడని.. సింగిల్​గా రావాలని సవాల్‌ చేశారు. విజయసాయిరెడ్డి 16 నెలల పాటు జైలు భోజనం తినడం వల్ల శరీరం మందపడిందని ఎద్దేవా చేశారు. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చారలు చూసుకొని విజయసాయి రెడ్డి పులిగా ఫీల్ అవ్వడంలో తప్పు లేదని అయన్నపాత్రుడు సైటెర్లు వేశారు.

ఇవీ చదవండి:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.