ETV Bharat / city

తెలంగాణ: వలకు చిక్కిన 5 కిలోల 'బంగారు' చేప

author img

By

Published : Dec 29, 2020, 3:39 PM IST

తెలంగాణ: వలకు చిక్కిన 5 కిలోల 'బంగారు' చేప
తెలంగాణ: వలకు చిక్కిన 5 కిలోల 'బంగారు' చేప

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. పూర్తిగా బంగారు వర్ణంలో ఉన్న ఓ 5 కిలోల చేప వలలో పడింది. అరుదుగా కనిపించే అందమైన చేపను చూసేందుకు పలువురు ఆసక్తి కనబరిచారు.

తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్‌పల్లి చెరువులో లింగాపూర్‌కు చెందిన పలువురు మత్స్యకారులు చేపల కోసం వలలు వేశారు. ఈ క్రమంలోనే ఓ మత్స్యకారుని వలలో బంగారు వర్ణంలో ఉన్న చేప చిక్కింది. దీని బరువు సుమారు 5 కిలోల వరకు ఉన్నట్లు మత్స్యకారుడు తెలిపాడు.

చేప పూర్తిగా బంగారు వర్ణంలో ఉండటంతో పలువురు ఆసక్తిగా తిలకించారు. ఇలాంటి చేపలు అరుదుగా కనిపిస్తాయని మత్స్యకారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్​ వాదన అనుమానాస్పదంగా ఉంది: షబ్బీర్​ అలీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.