హైకోర్టును రాయలసీమకు తరలించాలని సచివాలయం ఎదుట రాయలసీమ న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రిని కలిశాకే వెళ్తామని డిమాండ్ చేశారు. అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నుంచి వచ్చిన న్యాయవాదులు సీఎం కాన్వాయ్ వెళ్తుండగా నినాదాలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే రాయలసీమలోనే హైకోర్టు ఉండాలని న్యాయవాదులు అన్నారు.
ఇదీ చదవండి:''శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం.. హై కోర్టు ఏర్పాటు చేయండి''