ETV Bharat / city

Social Media Case: జడ్జిలను దూషించిన కేసులో న్యాయవాదులకు బెయిల్

author img

By

Published : Feb 25, 2022, 1:11 PM IST

Bail in Social Media Case: కోర్టులు, న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితులైన ఇద్దరు న్యాయవాదులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

hc on social midia accused bail
hc on social midia accused bail

సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నిందితులైన ఇద్దరు న్యాయవాదులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతీ సోమవారం విజయవాడలోని సీబీఐ క్యాంపు కార్యాలయంలో సంతకాలు పెట్టాలని ఆదేశించింది.

సోషల్ మీడియా కేసులో ఇటీవల న్యాయవాదులు కళానిధి గోపాలకృష్ణ, మెట్ట చంద్రశేఖర్​లను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఇరువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కళానిధి గోపాలకృష్ణకు ఆరోగ్యం సరిలేదని న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఇరువురు న్యాయవాదులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి:

YS Viveka Case: వివేకా రక్తపు వాంతులతో చనిపోయినట్లు వైఎస్‌ మనోహర్‌రెడ్డి చెప్పారు: ప్రతాప్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.