ETV Bharat / city

నాడు-నేడు పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదు: మంత్రి సురేశ్

author img

By

Published : Nov 4, 2020, 4:13 PM IST

nadu-nedu projects in schools
nadu-nedu projects in schools

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన 'నాడు-నేడు' పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేెశ్ స్పష్టం చేశారు. నిర్లక్ష్యం వహించిన కంపెనీలకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులు ఈ పనుల్ని పర్యవేక్షించాల్సిందిగా మంత్రి సూచించారు. సచివాలయం నుంచి పాఠశాలల్లో నాడు నేడు పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. సామగ్రి సరఫరా చేయలేని కంపెనీల ఒప్పందాలను పరిశీలించి నోటీసులు జారీ చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దశల వారీగా చేపట్టిన ఈ పనులను నిర్దేశిత కార్యాచరణ ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

ఆ రాష్ట్రాల్లో ట్రంప్ గెలిస్తే ఫలితాలు తారుమారే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.