ETV Bharat / city

బైకు మీద ఒకరు.. ఫోర్ వీలర్​లో ఇద్దరే: తెలంగాణ డీజీపీ

author img

By

Published : Mar 23, 2020, 3:01 PM IST

dgp-mahender
dgp-mahender

ఈరోజు నుంచి ద్విచక్రవాహనంపై ఒకరు, ఫోర్ వీలర్​పై ఇద్దరికి మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్​రెడ్డి వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

బైకు మీద ఒకరు.. ఫోర్ వీలర్​పై ఇద్దరే: తెలంగాణ డీజీపీ

ఈరోజు నుంచి ద్విచక్రవాహనంపై ఒకరికి, ఫోర్ వీలర్‌పై ఇద్దరికి మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్​రెడ్డి తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఆటో సంఘాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. లాక్​ డౌన్ అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్​రెడ్డి వెల్లడించారు.

ఇవీ చూడండి: తెలంగాణలో 30కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.