ETV Bharat / city

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల శాఖాపరమైన పరీక్షలు వాయిదా

author img

By

Published : Aug 23, 2020, 12:42 PM IST

department wise exams for ap state government are postponed
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జరగాల్సిన శాఖాపరమైన పరీక్షలు వాయిదా

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల 25 నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు జరగాల్సిన శాఖాపరమైన పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. కరోనా వైరస్ వ్యాప్తి అధికమవుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈనెల 25 నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు జరగాల్సిన శాఖాపరమైన పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. ఇప్పటికే ఈ పరీక్షల నిర్వహణ కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. కొవిడ్ నింబధనలకు అనుగుణంగా నిర్వహణ కోసం సమయత్తమైనా.. కరోనా వ్యాప్తిని, కొత్త కేసుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం మార్చుకుంది.

పరీక్షలను తర్వాత నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ పరీక్షలకు 1.75 లక్షల మంది దరఖాస్తు చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు పేర్కొన్నారు. ఇందులో లక్షా 30 వేల మంది సచివాలయ ఉద్యోగులే ఉన్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

చైనా 'కరోనా వ్యాక్సిన్'​​ విడుదల.. తక్షణమే వినియోగంలోకి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.