ETV Bharat / city

బస్సుకింద పడి ఆత్మహత్య చేసుకున్న కొవిడ్​ బాధితుడు

author img

By

Published : May 3, 2021, 7:12 AM IST

బస్సు కింద పడి ఆత్మహత్య
బస్సు కింద పడి ఆత్మహత్య

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మున్సిపల్​ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్​ వద్ద దారుణం జరిగింది. కొవిడ్​ బాధితుడు బస్సు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ప్రాణాంతక వైరస్​ సోకింది.. ప్రాణం నిలుస్తుందన్న గ్యారంటీ లేదు. బతికుండి అయినోళ్లకు భారం కాకూడదు. ఆరోగ్యం విషమించి ఉక్కిరిబిక్కిరై ఊపిరొదలకూడదు. ఇలా కకావికలమైన మనసుకు అపోహలు తోడై.. మనసులో రేగిన కల్లోలం కొవిడ్​ బాధితుడిని ఆత్మహత్య చేసుకునేలా చేసింది. సిగ్నల్​ పడగా కదులుతున్న బస్సు చక్రంకింద తలపెట్టి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సూర్యనగర్​కు చెందిన కాంపెల్లి శ్రీనివాస్​ గోదావరిఖని మున్సిపల్​ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్​ వద్ద ఆర్టీసీ బస్సు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సిగ్నల్​ వద్ద ఆగి ఉన్న బస్సు వెనుక చక్రం వద్ద నిలబడిన శ్రీనివాస్​ సిగ్నల్​ పడగానే చక్రం కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

శ్రీనివాస్​కు కొవిడ్​ పాజిటివ్​ వచ్చిందని... ఆరోగ్యం విషమించి తాను బతకడం కష్టమనే భయంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధరించామని పోలీసులు తెలిపారు. మున్సిపల్​ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీ చూడండి: కరోనా కాటు: కుటుంబసభ్యుల ముందే ప్రాణాలొదిలిన ఇంటిపెద్ద

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.