ETV Bharat / city

తెలంగాణలో మరో 206 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

author img

By

Published : Jan 18, 2021, 11:51 AM IST

corona cases and deaths updates in telangana today
తెలంగాణలో మరో 206 కరోనా కేసులు, ఇద్దరు మృతి

తెలంగాణలో కొత్తగా 206 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు.

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 206 కరోనా కేసులు నమోదవ్వగా.. మహమ్మారి బారిన పడి ఇద్దరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి.. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,91,872 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ సోకి ఇప్పటివరకు 1,579 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో.. కరోనా నుంచి మరో 346 మంది బాధితులు కోలుకున్నారు.

వారితో కలిపి.. ఇప్పటివరకు 2,86,244 మంది వైరస్​ నుంచి బయటపడ్డారు. తెలంగాణలో ప్రస్తుతం 4,049 కరోనా యాక్టివ్ కేసులుండగా.. ప్రస్తుతం 2,281 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 45 కరోనా కేసులు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:

తెలంగాణ: కొవిడ్ టీకా తీసుకున్నవారు పాటించాల్సిన జాగ్రత్తలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.