ayyappa padayatra: 580 కి.మీ. పాదయాత్రలో అన్నాచెల్లెలు.. !

author img

By

Published : Jan 7, 2022, 5:41 PM IST

ayyappa padayatra

brother and sister sabarimala padayatra: అయ్యప్ప మాల వేసుకుని, నెత్తిపై ఇరుముడి పెట్టుకుని.. బుడిబుడి నడకలతో స్వామి దర్శనానికి బయలుదేరారు ఇద్దరు చిన్నారులు. ఇంతచిన్న వయసులో వారు 580 కిలోమీటర్లు ప్రయాణించి కేరళలోని శబరిమలను చేరుకోవాలని సంకల్పించడం గమనార్హం.

sabarimala padayatra brother and sister: కేరళలోని శబరిమలకు పాదయాత్ర చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ఇద్దరు చిన్నారులు. బెంగళూరు నుంచి ప్రారంభమైన ఈ అన్నాచెల్లెలు.. 580 కిలోమీటర్ల పాటు కాలినడకన ప్రయాణించి శబరిమలకు చేరుకోనున్నారు.

ఇంత చిన్న వయసులో వీరి భక్తిభావానికి పలువురు అభినందనలు కురిపిస్తున్నారు. ఆడిపాడాల్సిన వయసులో వీరు చేస్తున్న పాదయాత్రను చూసి ఆశ్చర్యపోతున్నారు. అయ్యప్ప మాల ధరించి బుడిబుడి అడుగులు వేసుకుంటూ స్వామియే శరణం అయ్యప్ప అంటూ సాగే వీరి యాత్రకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్​గా మారింది.

ఇదీ చూడండి:

ఒంటికాలితో అయ్యప్ప భక్తుడి సాహసయాత్ర.. 750 కి.మీ నడక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.