ETV Bharat / city

AP TOPNEWS:ప్రధాన వార్తలు@5PM

author img

By

Published : Jul 28, 2022, 4:59 PM IST

Updated : Jul 28, 2022, 5:09 PM IST

ap topnews
ap topnews

.

  • CBN TOUR IN TS: ఖమ్మం జిల్లాలో చంద్రబాబు పర్యటన.. నేతల ఘనస్వాగతం..
    గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటనకు బయల్దేరిన చంద్రబాబుకు తెలంగాణలో ఘనస్వాగతం లభించింది. తెలంగాణ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నరసింహులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ ప్రయోజనాలు వివరిస్తూ.. రైతులకు లేఖలు రాయాలి: సీఎం జగన్..
    వ్యవసాయ మెటార్లకు మీటర్ల వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ రైతులకు లేఖలు రాయాలని విద్యుత్‌ రంగంపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళంలో పైలట్‌ ప్రాజెక్ట్‌ వల్ల .. 33.75 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా అయిన విషయం రైతులకు వివరించాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'నేపాల్​ క్యాసినోకి చాలామంది వెళ్లారు.. ఆ జాబితా ప్రభుత్వం బయటపెట్టగలదా?'..
    గుడివాడలో సంక్రాంతి సందర్భంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ నేతృత్వంలో చికోటీ ప్రవీణ్ క్యాసినో నిర్వహించారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. అలాగే నేపాల్ క్యాసినోకి రాష్ట్రం నుంచి వేలాది మంది వెళ్లారని.. అందులో సగం మంది అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలున్నారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • విద్యార్థినులను వేధించిన యువకులు.. ఆ తర్వాత..
    విద్యార్థినులను వేధిస్తున్న ఇద్దరు యువకులకు గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన ఎన్టీఆర్​ జిల్లా పెనుగంచిప్రోలు మండలంలో చోటు చేసుకుంది. కొంతకాలంగా విద్యార్థినులను వేధింపులకు గురి చేశారు. తాజాగా బుధవారం కళాశాల నుంచి ఆటోలో తిరిగి వస్తుండగా బాలికలను అడ్డగించారు. దీంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు యువకులకు బుద్ధి చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బంగాల్​ మంత్రి పార్థా ఛటర్జీ బర్తరఫ్​..
    ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో అరెస్టైన బంగాల్​ మంత్రి పార్థా ఛటర్జీని బర్తరఫ్ చేశారు. ఈ మేరకు బంగాల్‌ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చెన్నై 'చెస్ ఒలింపియాడ్' నుంచి పాక్ ఔట్.. 'అంతా రాజకీయం!'..
    భారత్​లో జరుగుతున్న చెస్ ఒలింపియాడ్ నుంచి పాక్ వైదొలిగింది. వారి జట్టు ఇక్కడకు చేరుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అంతర్జాతీయ ఈవెంట్​ను సైతం పాకిస్థాన్ రాజకీయం చేస్తోందని భారత విదేశాంగ శాఖ మండిపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రవితేజకు షాక్​.. 'రామారావు ఆన్​ డ్యూటీ' సీన్స్​ లీక్​!..
    'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రబృందానికి ఎదురుదెబ్బ తగిలింది. శుక్రవారం విడుదల కావాల్సిన ఈ మూవీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు సోషల్​మీడియాలో లీకయ్యాయి. ఎడిటింగ్​ రూమ్​ నుంచే ఇవి లీక్​ అయినట్లు చిత్ర బృందం అనుమానం వ్యక్తం చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • హిట్​మ్యాన్​ రికార్డ్ బ్రేక్ చేసిన కివీస్ ప్లేయర్.. టీ20ల్లో టాపర్​గా..
    న్యూజిలాండ్ ప్లేయర్​ మార్టిన్‌ గుప్టిల్‌ టీ20 క్రికెట్​లో కొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను అధిగమించి అగ్రస్థానానికి చేరుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • స్టాక్​ మార్కెట్లలో ఫుల్​ జోష్​.. సెన్సెక్స్​ 1000 ప్లస్​..
    దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 1041 పాయింట్లు, నిఫ్టీ 287 పాయింట్లు లాభపడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఇక అణ్వాయుధాలతోనే జవాబు!'.. ఆ దేశాలకు కిమ్ వార్నింగ్..
    అమెరికా, దక్షిణ కొరియాతో ఉద్రికత్తలు పెరిగిన వేళ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌.. తీవ్ర హెచ్చరికలు చేశారు. శత్రు దేశాలపై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అమెరికా ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని దుయ్యబట్టారు. దక్షిణ కొరియా కొత్త అధ్యక్షుడు యున్ సుక్ యోల్‌ను యుద్ధ ఉన్మాదిగా కిమ్‌ అభివర్ణించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
Last Updated :Jul 28, 2022, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.