ETV Bharat / city

ప్రధానవార్తలు @9AM

author img

By

Published : Jul 27, 2022, 8:59 AM IST

9AM TOPNEWS
ప్రధానవార్తలు @9AM

.

  • CM Jagan: 15 రోజుల్లో వరద నష్టం గణన పూర్తి

‘గోదావరి వరదలతో ముంపునకు గురైన కుటుంబాల్లో ప్రతి ఇంటికీ 25 కేజీల బియ్యం, నిత్యావసరాలు, రూ.2వేల సాయం అందించాం. పశువులకు నోరుంటే అవీ మెచ్చుకునేలా వాటినీ చూసుకోవాలని ఆదేశాలిచ్చి.. ఆదుకున్నాం’ అని సీఎం జగన్‌ చెప్పారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలైన జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, ఊడిమూడిలంక, బూరుగులంకలో.. రాజోలు మండలం మేకలవారిపాలెం, తాటిపాకమఠం గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కర్నూలులో కారు-లారీ ఢీకొని ముగ్గురు మృతి

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నూలు సమీపంలోని రింగ్​ రోడ్డు వద్ద కారు, లారీ ఢీకొని ముగ్గురు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని సోమశేఖర్​, గణేష్​, రుద్రగా గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • సీఎం జగన్ పెన్ను లాగేసిన చిన్నారి.. ఆ తర్వాత

కోనసీమ జిల్లాలోని గోదావరి వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పి.గన్నవరం మండలం జి. పెదపూడిలంకలో వరద బాధితులను పరామర్శించిన జగన్.. ఓ ఎనిమిది నెలల చిన్నారిని ఆప్యాయంగా ఎత్తుకున్నాడు. అనంతరం అక్కడి వరద బాధితులతో మాట్లాడుతుండగా చిన్నారి విజయ చైతన్య సీఎం జగన్ జేబులో పెన్నును లాగేశాడు. పెన్ను కింద పడిపోగా.. భద్రతా సిబ్బంది తీసి జగన్​కు ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మన్యం జిల్లాలో విష జ్వరాలు

పార్వతీపురం మన్యం జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. బాధితులు భారీ సంఖ్యలో ఆసుపత్రులకు వస్తున్నారు. ప్రతీ రోజు 200 మందికి పైగా వస్తుండగా వారిలో 50 నుంచి 60 మంది ఇన్​పేషంట్లుగా చేరుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పిడుగుపాటుకు 40 మంది బలి.. పశువుల్ని మేపుతూ అక్కడికక్కడే..!

మంగళవారం ఒక్కరోజే పిడుగుపాటుకు 20 మంది మరణించిన ఘటన బిహార్​లో జరిగింది. 8 జిల్లాల్లో ఈ మరణాలు నమోదయ్యాయి. యూపీలో రెండు రోజుల వ్యవధిలో 18 మంది చనిపోయారు. ఝార్ఖండ్​లోనూ పిడుగుపాటుతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఒక్క నెల కరెంట్ బిల్లు రూ.3వేల కోట్లు.. ఆస్పత్రిలో ఇంటి ఓనర్​!

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని గ్వాలియర్‌ నగర శివ్‌విహార్‌ కాలనీలో నివాసం ఉంటున్న ప్రియాంక గుప్తా కుటుంబం అయిదారు రోజుల కిందట తమ ఇంటికి వచ్చిన విద్యుత్తు బిల్లును చూసి కళ్లు తేలేసింది. రూ.3,419 కోట్ల విద్యుత్తు బిల్లు చూసిన ఆ ఇంటిపెద్ద (ప్రియాంక మామ) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కేవలం స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్‌ వ్యాపిస్తుందా? అందులో నిజమెంత?

ప్రపంచ దేశాలను మరోసారి వణికిస్తోన్న మంకీపాక్స్‌ వైరస్‌ కేవలం స్వలింగ సంపర్కం, లైంగిక కలయికతోనే వ్యాపిస్తుందా?.. వైరస్​ సోకిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్నా సోకుతుందా? కరోనా వైరస్​తో మంకీపాక్స్​ను పోల్చవచ్చా? వీటిన్నంటిపై ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌ క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ఏదేమైనా పెట్టుబడుల్లో తగ్గేదేలే.. త్వరలోనే విదేశాల్లో కూడా'

దేశ వృద్ధితోనే తమ గ్రూప్‌ విజయం ఆధారపడి ఉంటుందని అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ అన్నారు. దేశంలో పెట్టుబడులు కొనసాగించే విషయంలో మందకొడిగా కానీ.. లేదంటే నిలిపివేయడం కానీ జరగదని స్పష్టం చేశారు. పలు విదేశీ ప్రభుత్వాలు తమ దేశాల్లో మౌలిక వసతుల నిర్మాణాలకు సహాయం చేయమని కోరినందున.. విదేశాల్లోనూ విస్తరణ కోసం పునాది వేస్తున్నామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేనెప్పటికీ అతడి స్థాయికి చేరుకోలేను: ద్రవిడ్​

టీమ్‌ఇండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తన ఆటకు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేశాడు. తన ఆలోచనా విధానాన్ని క్రికెట్‌ నుంచి తప్పిస్తే మానసికంగా ఎలా ఉపయోగపడిందో వివరించాడు. తానెప్పటికీ మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌లా ఉండలేనని చెప్పాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'తూర్పు- పడమర' కలిపింది ఆ ఇద్దరినీ.. 'త్రినయని' సీరియల్​ రియల్​ జోడీ

సీరియల్​ నటీనటులకు ఫ్యామిలీ ఆడియన్స్​లో క్రేజ్​ మామూలుగా ఉండదు. వారి పర్సనల్​ విషయాలను తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. అందుకే బుల్లితెరపై సార్స్​గా వెలుగొందుతున్న కొందరు నటీనటుల రియల్​ జోడీస్​ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.