ఆంగ్ల మాధ్యమంపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఎక్కువ మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియం కోరుకుంటున్నారని పిటిషన్లో పేర్కొంది.
పేద విద్యార్థులకు లబ్ధి చేకూర్చేందుకే ఆంగ్ల మాధ్యమంపై జీవోలు తెచ్చామని తెలిపింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరింది. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 81, 85 జీవోలను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది.
ఇదీ చూడండి ..
హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన డాక్టర్ సుధాకర్ తల్లి