ETV Bharat / city

హెబియస్​ కార్పస్​ పిటిషన్​ దాఖలు చేసిన డాక్టర్​ సుధాకర్​ తల్లి

author img

By

Published : Jun 4, 2020, 6:41 PM IST

Updated : Jun 4, 2020, 9:49 PM IST

మత్తు డాక్టర్​ సుధాకర్​ తల్లి హైకోర్టులో హెబియస్​ కార్పస్​​ పిటిషన్​ దాఖలు చేశారు. తన కుమారుడు ఎవరి ఆధీనంలో ఉన్నాడో తెలపాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు.

హౌస్​ మోషన్​ పిటిషన్​ దాఖలు చేసిన డాక్టర్​ సుధాకర్​ తల్లి
హౌస్​ మోషన్​ పిటిషన్​ దాఖలు చేసిన డాక్టర్​ సుధాకర్​ తల్లి

విశాఖ ఘటనలో దాడికి గురై ప్రస్తుతం ప్రభుత్వ మానసిక చికిత్సాలయంలో చికిత్స పొందుతున్న డా.సుధాకర్ ఎవరి ఆధీనంలో ఉన్నారో తెలపాలంటూ హైకోర్టులో హెబియస్​ కార్పస్​ పిటిషన్​ దాఖలైంది. సుధాకర్ తల్లి ఈ పిటిషన్​ను హౌస్ మోషన్​లో వేశారు. దీనిపై కోర్టు అనుమతి రాగానే విచారణకు వచ్చే అవకాశముందని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రవణ్ కుమార్ తెలిపారు.

కాగా మానసిక చికిత్సాలయం నుంచి సుధాకర్​ను మరో ఆస్పత్రికి మార్చాలంటూ ‌ఆయన తరఫు న్యాయవాదులు వేసిన పిటిషన్​పై విచారణను ధర్మాసనం సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.

ఇదీ చూడండి..

వైద్యుడు సుధాకర్ వ్యవహారంపై హైకోర్టు విచారణ వాయిదా

Last Updated : Jun 4, 2020, 9:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.