ETV Bharat / city

ఆంగ్ల మాధ్యమంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్​

author img

By

Published : Oct 28, 2020, 8:17 PM IST

supreme court
supreme court

ఆంగ్లమాధ్యమం అంశంలో హైకోర్టులో ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన మరో పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. గుంటూరు జిల్లాకు చెందిన 5, 9 తరగతులు చదువుతున్న ఇద్దరు విద్యార్థుల పేరుతో ఈ పిటిషన్​ దాఖలైంది.

ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన 5, 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల పేరుతో పిటిషన్ దాఖలైంది. దీనిపై బుధవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే ధర్మాసనం... ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. గతంలో ఆంగ్ల మాధ్యమం అంశంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లకు దీనిని జత చేసింది.

ఇదీ చదవండి

ప్రస్తుతం స్థానిక ఎన్నికల నిర్వహణ కష్టం: సీఎస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.