ETV Bharat / city

తెలంగాణలో ఇంటర్ పరీక్షలు... అయోమయంలో ఏపీ విద్యార్థులు

author img

By

Published : May 11, 2020, 11:57 AM IST

intermediate students struggles
అయోమయంలో ఏపీ ఇంటర్ విద్యార్థులు

లాక్​డౌన్​ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నిలిచిన ఇంటర్​ పరీక్షలను నిర్వహించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. నగరంలో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులు... పరీక్షల వాయిదా సమయంలో స్వగ్రామాలకు చేరుకున్నారు. తాజా ప్రకటనతో పరీక్షలకు ఎలా హాజరుకావాలో తెలియక సతమతమవుతున్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణలో నిలిచిన ఇంటర్మీడియట్‌ భూగోళశాస్త్రం, మోడల్‌ లాంగ్వేజెస్‌ పరీక్షలను ఈ నెల 18న నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్‌ ప్రకటించింది. హైదరాబాద్‌లో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులు... లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎలాగోలా తమ స్వగృహాలకు చేరుకున్నారు. ప్రభుత్వం తాజా ప్రకటనతో పరీక్ష రాసేందుకు వారు ఇప్పుడు హైదరాబాద్​కు ఎలా చేరుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు.

ప్రజారవాణా వ్యవస్థ పున:ప్రారంభం కాకముందే పరీక్షల తేదీని ప్రకటించడం వారిని అయోమయానికి గురి చేస్తోంది. ఐఏఎస్‌ సాధన లక్ష్యంగా బోధించే ఇంటర్‌, డిగ్రీ అయిదేళ్ల సమీకృత కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ప్రధానంగా ఈ సమస్య ఎదురైంది. పరీక్ష సమయంలో వసతిగృహం కూడా ఉండదని, ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియడం లేదని విద్యార్థులు వాపోతున్నారు.

ఇవీ చూడండి: పరిహారం కోసం పోలీసులనే మోసం చేయబోయాడు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.