ETV Bharat / state

పరిహారం కోసం పోలీసులనే మోసం చేయబోయాడు..!

author img

By

Published : May 10, 2020, 11:13 PM IST

విశాఖ గ్యాస్​ లీకేజీ ఘటనను సొమ్ము చేసుకుందామనుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. ఏకంగా పోలీసులకే కుచ్చుటోపీ పెడదామనుకున్నాడు. కానీ అతను వేసిన ఎత్తులు పోలీసులు ముందు పారలేదు. చివరికి తన తప్పు ఒప్పుకున్నాడు ఆ వ్యక్తి.

A man tried to deceive the police in r.r. venkatapuram
A man tried to deceive the police in r.r. venkatapuram

మీడియాతో మంత్రి కన్నబాబు

విశాఖ దుర్ఘటన ఎంతో మందికి శోకాన్ని మిగిలిస్తే.... ఆ వ్యక్తికి మాత్రం దుర్బుద్ధి పుట్టించింది. ఎల్​జీ పాలిమర్స్​కు పరిసరాల్లోని ఓ గ్రామానికి చెందిన సురేశ్ అనే వ్యక్తి గ్యాస్ లీకేజీ ఘటన తర్వాత తన ఇంట్లో రూ.20 లక్షలు పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా... అది వాస్తవం కాదని తేలింది. పోలీసులు అతన్ని ప్రశ్నించగా... భారీ పరిహారం వస్తుందని తప్పుడు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఈ విషయాలను విశాఖ క్రైమ్ ఏసీపీ పెంటారావు వెల్లడించారు. ప్రజలు భయపడవద్దని.. నిరంతరం పోలీసు పర్యవేక్షణ ఉంటుందని పెంటారావు తెలిపారు.

ఈ విషయంపై మంత్రి కన్నబాబు సైతం స్పందించారు. పరిశ్రమ చుట్టు పక్కల గ్రామాల్లో పోలీసులు నిఘా ఉందని... ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

విశాఖ దుర్ఘటనకు సంస్థ వైఫల్యమే కారణం: మంత్రి బొత్స

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.