ETV Bharat / city

' ఆదుకోవాల్సిన వారే.. మాట తప్పి కన్నీరు పెట్టిస్తున్నారు'

author img

By

Published : Aug 3, 2020, 4:11 PM IST

Updated : Aug 3, 2020, 10:14 PM IST

amravati-woman
amravati-woman

మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి మహిళలు వినూత్నంగా నిరసన చేపట్టారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ప్రధాని మోదీ, సీఎం జగన్ చిత్రపటాలకు రాఖీలు కట్టారు. రాజధాని మహిళల ఆవేదనను అర్థం చేసుకోవాలని ఐకాస ప్రతినిధులు కోరారు.

amravati-woman
రాఖీలు కడుతున్న మహిళా జేఏసీ ప్రతినిధులు

అమరావతి పరిరక్షణ సమితి మహిళా ఐకాస ఆధ్వర్యంలో విజయవాడలో రాఖీ నిరసన నిర్వహించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం జరిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్‌మోహన్ మాస్క్‌లకు రాఖీలు కట్టారు.

' ఆదుకోవాల్సిన వారే.. మాట తప్పి కన్నీరు పెట్టిస్తున్నారు'

అన్నగా, తమ్ముడిగా ఆదుకోవాల్సిన వారే... మాట తప్పి మహిళలతో కన్నీరు పెట్టించారని విమర్శించారు. రాఖీ పండగ రోజున సందర్భంగా.. సోదరీమణుల ఆవేదన అర్థం చేసుకోవాలని కోరారు. అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలి విజ్ఞప్తి చేశారు. కేంద్రం, రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం ప్రోత్సహిస్తోందని విమర్శించారు.

ఇదీ చదవండి

ఎస్ఈసీగా ‌మరోసారి బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ రమేశ్​‌ కుమార్

Last Updated :Aug 3, 2020, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.