ETV Bharat / city

'మేం రాజధానికి భూములిచ్చాం.. ఇళ్ల స్థలాలకు కాదు'

author img

By

Published : Sep 30, 2020, 5:58 PM IST

తామంతా రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చామని... ఇళ్ల స్థలాలకు కాదని అమరావతి రైతులు మండిపడ్డారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... రైతులు చేస్తున్న దీక్షలు 288వ రోజుకు చేరుకున్నాయి. దళిత మహిళ ఐకాస నేతలు నిరసనలో పాల్గొన్నారు. దేశంలోని పలు పార్టీల నేతలు 3 రాజధానులను వ్యతిరేకించారని గుర్తు చేశారు.

మేం రాజధానికి భూములిచ్చాం..ఇళ్ల స్థలాలకు కాదు
మేం రాజధానికి భూములిచ్చాం..ఇళ్ల స్థలాలకు కాదు

పరిపాలన రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 288వ రోజుకు చేరుకున్నాయి. వెలగపూడి, తుళ్లూరు, మందడం, ఐనవోలు, దొండపాడు, అనంతవరం, వెంకటపాలెం, బోరుపాలెంలలో రైతులు ఆందోళన కొనసాగించారు. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు నినాదాలు చేశారు.

దేశంలోని పలు పార్టీల నేతలు 3 రాజధానులను వ్యతిరేకించారని దళిత మహిళ ఐకాస నేతలు గుర్తు చేశారు. తామంతా రాజధాని కోసం భూములిచ్చామని... ఇళ్ల స్థలాలకు కాదని గుర్తు చేశారు. జగన్ తన ప్రకటనను వెనక్కి తీసుకునే దాకా దీక్షా శిబిరాలను కొనసాగిస్తామని రైతులు తేల్చిచెప్పారు.

ఇదీ చదవండి:

బురద రాజకీయాలు మాని వరద బాధితులను ఆదుకోండి: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.