ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @9PM

author img

By

Published : Apr 29, 2022, 8:59 PM IST

9PM Top news
ప్రధాన వార్తలు @5PM

.

  • గుంటూరు ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి ఉరిశిక్ష
    గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్యకేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇప్పటికే నేర నిర్ధారణ చేసిన ప్రత్యేక న్యాయమూర్తి.. మధ్యాహ్నం నిందితుడికి ఉరి శిక్ష ఖరారు చేసి తీర్పునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏపీలో కరెంటు, నీళ్లు లేవు.. సమావేశంలో మంత్రి కేటీఆర్‌
    ఆంధ్రప్రదేశ్‌ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్‌ పరోక్షంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో కరెంట్‌, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయని మిత్రులు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కేటీఆర్​కు మంత్రులు కౌంటర్​​
    ఏపీని ఉద్దేశించి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు స్పందించారు. కేటీఆర్.. తన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ప్రజల తాగునీటి అవస్థలపై చంద్రబాబు ఆవేదన
    అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రజల నీటి అవస్థలపై తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 150 గిరిజన కుటుంబాలు నివాసముండే ఈ గ్రామంలో నీటి ట్యాంక్‌ మోటార్లు పాడయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'త్వరలో హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు.. అదే ప్రధాన లక్ష్యం'
    దేశంలోని హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి పేర్లు సూచించాలని సంబంధిత కోర్టు ప్రధాన న్యాయమూర్తులను కోరారు సీజేఐ జస్టిస్​ రమణ. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల 39వ సదస్సు సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 5-12 ఏళ్ల చిన్నారులకు కరోనా టీకాపై ట్విస్ట్!
    5-12 ఏళ్ల వయసు చిన్నారులకు టీకా పంపిణీపై శుక్రవారం జరిగిన సమావేశంలో సాంకేతిక సలహా బృందం (ఎన్​టీఏజీఐ) ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. మరోవైపు 12-17 ఏళ్ల వయసు మధ్య వారికి సీరం సంస్థ రూపొందించిన కొవొవాక్స్‌ టీకాకు ఎన్​టీఏజీఐ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శ్రీలంక ప్రధాని మార్పు.. త్వరలో మధ్యంతర ప్రభుత్వం?
    సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో నిరసనలు ఉద్ధృతమవుతున్న వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. ప్రధాని మహింద రాజపక్సను తొలగించి.. ఆయన స్థానంలో వేరొకరని నియమించేందుకు సిద్ధమైనట్లు పార్లమెంట్​ సభ్యుడు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మార్కెట్లకు నష్టాలు.. సెన్సెక్స్​ 460 పాయింట్లు డౌన్
    భారత స్టాక్​ మార్కెట్లు నష్టాలను నమోదు చేశాయి. బ్యాంక్​, పవర్, ఆయిల్​, క్యాపిటల్​ గూడ్స్​ షేర్లు నష్టాలను నమోదు చేయడం మార్కెట్​పై తీవ్ర ప్రభావం చూపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సెమీఫైనల్స్​కు దూసుకెళ్లిన పీవీ సింధు
    ఆసియా బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బ్యాడ్మింటన్​ స్టార్​ పీవీసింధు మరో అడుగు ముందుకేసింది. గురువారం జరిగిన క్వార్టర్స్​లో గెలిచి సెమీ​ ఫైనల్స్​కు దూసుకెళ్లింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆచార్య' ఎలా ఉందంటే?
    మెగాస్టార్​ చిరంజీవి నటించిన 'ఆచార్య' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మెగాపవర్​స్టార్ రామ్​చరణ్​తో కలిసి చిరు పూర్తి స్థాయిలో నటించిన సినిమా కావడం వల్ల దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి అభిమానుల అంచనాలను 'ఆచార్య' అందుకున్నాడా?.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.