ETV Bharat / city

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5 PM

author img

By

Published : Oct 12, 2022, 5:01 PM IST

ఏపీ ప్రధాన వార్తలు
5PM TOP NEWS

.

  • వైకాపా మోసపూరిత ప్రకటనలతో ప్రజల మధ్య విద్వేషాలు: చంద్రబాబు
    Chandrababu Comments on YSRCP: ఉత్తరాంధ్రను కబళిస్తున్న వైకాపాకు వ్యతిరేకంగా పోరాడాలని తెదేపా నేతలను చంద్రబాబు సూచించారు. మరోవైపు విశాఖలో తన ఆస్తులపై విజయసాయిరెడ్డి వివరణపై తెదేపా నేతల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విశాఖలో వైకాపా నేతలు విజయసాయిరెడ్డి, ధర్మాన, బొత్సలు భూ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • "దేనికి గర్జన ?.. అంబులెన్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నందుకా?"
    Pawan Kalyan on ambulance mafia: వైకాపాపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ వరుస ట్వీట్లతో విమర్శలు గుప్పిస్తున్నారు. అంబులెన్స్ మాఫియాను గుర్తు చేస్తూ వైకాపాపై విరుచుకుపడ్డారు. దేనికి గర్జన?.. అంబులెన్స్ మాఫియాను పెంచి పోషిస్తున్నందుకా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ.. కౌంటర్ దాఖలుకు సమయం కోరిన కేంద్రం
    High Court on Visakha Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ జరిగింది. స్టీల్‌ప్లాంట్ భూముల విలువ కేవలం రూ.55 కోట్లు చూపడంపై పిటిషనర్ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. కౌంటర్ దాఖలుకు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది సమయం కోరారు. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Capital Roads: రాజధానిలో రోడ్లు.. రొచ్చు రొచ్చు..
    Capital Villages: గజానికో గుంత, అడుగేస్తే అడుసు అన్నంత దారుణంగా తయారైన ఈ రహదారులు.. రాష్ట్రానికే దిక్సూచిలా నిలుస్తుందనుకున్న రాజధాని అమరావతి గ్రామాల దుస్థితి అద్దం పడుతున్నాయి. అమరావతి నిర్మాణాన్ని అటకెక్కించిన రాష్ట్ర ప్రభుత్వం.. అక్కడి గ్రామాల్లో కనీస మౌలిక వసతుల కల్పననూ పట్టించుకోవడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నాటకం మధ్యలో గుండెపోటుతో శివుడి పాత్రధారి మృతి
    ఉత్తర్​ప్రదేశ్​లో ఓ నాటకం ప్రదర్శిస్తుండగా అపశ్రుతి జరిగింది. ఆదర్శ్ రామ్​లీలా సమితి బ్యానర్​లో భాగంగా జౌన్​పూర్​ జిల్లాలోని బెలాసిన్​ గ్రామంలో రామ్​లీలా స్జేజ్​పై ఓ నాటకం ప్రదర్శించారు. నాటకం ప్రారంభంలో హారతి ఇస్తున్న సమయంలో శివుడు పాత్రధారి ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. 52 ఏళ్ల రామ్ ప్రసాద్ అలియాస్ ఛబ్బన్ పాండేను వెంటనే గ్రామస్థులు ఆస్పత్రికు తరలించినా ఫలితం లేకపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నోట్ల రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. కేంద్రం, ఆర్​బీఐలకు నోటీసులు
    నోట్ల రద్దు అంశంపై కేంద్రం, రిజర్వు బ్యాంకుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయ సమీక్షలో ఉన్న "లక్ష్మణరేఖ" గురించి తమకు తెలుసని, అయితే ఈ సమస్య కేవలం "అప్రస్తుత" అంశంగా మారిందో లేదో అనే విషయాన్ని నిర్ణయించడానికి 2016 నోట్ల రద్దు నిర్ణయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పాపం.. ఒకేసారి 477 తిమింగలాలు మృతి
    రెండు వారాల క్రితం ఆస్ట్రేలియాలోని సముద్ర తీరంలో 200కిపైగా పైలట్‌ తిమింగలాలు మరణించిన ఘటన మరువక ముందే న్యూజిలాండ్‌లో కూడా ఈ తరహా ఘటనే జరిగింది. న్యూజిలాండ్‌లోని మారుమూల బీచ్‌లలో చిక్కుకుపోయి 477 పైలట్‌ తిమింగలాలు ప్రాణాలు కోల్పోయాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఈ టాప్ కంపెనీల ఎలక్ట్రిక్ బైక్​లలో ఏది బెస్ట్ తెలుసా
    ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్​ వాహనాల వినియోగం అధికమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన వివిధ సంస్థల ఎలక్ట్రిక్​ వాహనాల ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • టీమ్​ ఇండియాకు షాక్.. వరల్డ్ కప్​కు మరో ప్లేయర్ దూరం
    టీమ్​​ ఇండియాకు మరో షాక్​ తగిలింది. గాయాలతో సతమతమవుతున్న జట్టు నుంచి మరో స్టార్​ ప్లేయర్​ దూరం కానున్నాడు. దీంతో టీ20 వరల్డ్​ కప్​లో టీమ్​ ఇండియా ప్రదర్శనపై నీలినీడలు కమ్ముకున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొడుకు​ చేసిన ఆ పనికి షో మధ్యలోనే ఏడ్చేసిన అమితాబ్​
    బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ మంగళవారం తన 80వ పుట్టినరోజు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే బిగ్​బీ బర్త్‌డే సందర్భంగా ఆయన హోస్ట్​గా వ్యవహరిస్తున్న 'కౌన్‌ బనేగ కరోడ్‌ పతి' షోలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.