ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @5PM

author img

By

Published : Mar 2, 2022, 5:02 PM IST

Updated : Mar 2, 2022, 5:12 PM IST

ప్రధాన వార్తలు @5PM
ప్రధాన వార్తలు @5PM

.

  • ఏపీ రాజధాని అమరావతేనన్న కేంద్రం.. బడ్జెట్‌లో కేటాయింపులు
    రాష్ట్ర రాజధాని అమరావతి పేరుతో బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రొవిజన్‌ పెట్టింది. అమరావతినే రాజధానిగా పేర్కొంటూ.. ప్రాథమికంగా లక్ష రూపాయలు కేటాయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చు: అచ్చెన్నాయుడు
    ష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చని.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కార్యకర్తలకు సూచించారు. రాష్ట్ర సర్కార్​ అవలంభిస్తున్న రైతు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అర్హత లేని వారిని డీజీపీగా నియమించారు: ఎంపీ రఘురామ
    రాష్ట్రంలో సీనియర్‌ ర్యాంకు అధికారులను పక్కనపెట్టి.. అర్హత లేని వారిని డీజీపీగా నియమించారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ మేరకు.. కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సభలో చెప్పుతో కొట్టుకున్న వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడు.. కారణం ఇదే!
    ముదునూరి ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించడానికి సహకరించిందుకు బాధ పడుతున్నాంటూ వైకాపా నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకున్నారు. నరసాపురంలో నిర్వహించిన సభలో ఈ సంఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'రష్యా మీదుగా భారతీయుల తరలింపు.. సకాలంలోనే 'ఎస్400''
    ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని రష్యా తెలిపింది. రష్యా భూభాగం మీదుగా వారిని పంపించాలని భారత్ అభ్యర్థించిందని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రైలులో బంగారం అక్రమ రవాణా- 32కేజీలు స్వాధీనం
    రైలులో అక్రమంగా తరలిస్తున్న 32 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • బంగారం మరింత ప్రియం.. రూ.53 వేలు దాటిన ధర
    దేశంలో బంగారం ధర భారీగా పెరుగుతోంది. బుధవారం సెషన్​లో రూ.1,202 మేర ధర పెరిగింది. ప్రస్తుతం దిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ.51,889 పలుకుతోంది. హైదరాబాద్​లో పసిడి రేటు రూ.53 వేలు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వార్​ ఎఫెక్ట్​.. మార్కెట్లు ఢమాల్​.. సెన్సెక్స్​ 778 పాయింట్లు డౌన్​
    రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం నేపథ్యంలో.. స్టాక్​ మార్కెట్లు బుధవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 778 , నిఫ్టీ 187 పాయింట్లు కోల్పోయాయి. చముర ధరల పెరుగుదల మార్కెట్ల పతనానికి కారణమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • శ్రేయస్​ 8 స్థానాలు పైకి.. టాప్​-10లో లేని కోహ్లీ
    ఐసీసీ తాజాగా టీ20,టెస్ట్​, వన్డే ర్యాకింగ్స్​ను విడుదల చేసింది. భారత బ్యాటర్​ శ్రేయస్​ అయ్యర్​ 8 స్థానాలు మెరుగపడగా.. మాజీ కెప్టెన్ విరాట్​ కోహ్లీ 5 స్థానాలు కోల్పోయి 15వ స్థానంలో స్థిరపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విజువల్ వండర్​గా.. 'రాధేశ్యామ్' రిలీజ్ ట్రైలర్
    పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్​' చిత్రం నుంచి రెండో ట్రైలర్​ను విడుదల చేసింది చిత్రబృందం. మార్చి 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
Last Updated :Mar 2, 2022, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.