ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM

author img

By

Published : Jul 9, 2022, 2:58 PM IST

3PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 3 PM

..

  • TDP: 'షర్మిల పార్టీకి జగన్​ మద్దతుపై క్లారిటీ ఇవ్వాలి'
    వైకాపా ప్రీనరీ సమావేశాలపై తెదేపా నేతలు తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ అవసరాల కోసం రాష్ట్ర ప్రజల్ని వంచిస్తున్నారని మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు విమర్శించారు. మతాల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో షర్మిల పార్టీకి మద్దతు ఉందో ? లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బస్సులన్నీ వైకాపా ప్లీనరీకి.. ప్రయాణికుల అవస్థలు
    రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులను వైకాపా ప్లీనరీ సమావేశాలకు తరలించడంతో విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రైవేటు,విద్యా సంస్థల బస్సుల్లో కూడా పెట్టారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్లీనరీ పేరుతో తమను ఇబ్బందులకు గురిచేయడం ఏంటని బాపట్ల జిల్లా చీరాలలో ప్రయాణీకులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. కలవకూరులో జనాన్ని ప్లీనరీకి తరలించేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు విద్యుదాఘాతానికి గురైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కోడికత్తి కేసు.. సీజేఐకి లేఖ రాసిన నిందితుడి తల్లి
    రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌ తల్లి సావిత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు లేఖ రాశారు. తన కుమారుడు శ్రీనివాస్‌ను తక్షణమే విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. సుమారు నాలుగేళ్లుగా తన కుమారుడిని రిమాండ్ ఖైదీగానే కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఊరి చివర దొరికిందని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఒక్కసారిగా..!
    Ammunition material blast: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కేతిరెడ్డి కాలనీలో ఘోరం జరిగింది మందు గుండు సామాగ్రి పేలి మహిళకు తీవ్రగాయాలయ్యాయి. కాలనీకి చెందిన అశోక్ అనే భవన నిర్మాణ కార్మికుడి ఇంటిలో నిల్వ ఉంచిన మందు గుండు సామాగ్రి అటక పైనుంచి కిందపడి పేలటంతో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో అశోక్ భార్య భవాని గాయపడగా.. వినికిడి సైతం కోల్పోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'నేను దుర్గాదేవిని.. నా భర్తను వదలండి'.. మహిళ హైడ్రామా.. పోలీస్ స్టేషన్​లో చేతబడి!
    తన భర్తను పోలీసుల చెర నుంచి విడిపించేందుకు ఓ మహిళ హైడ్రామా చేసింది. తాను దుర్గాదేవినని పేర్కొంటూ పోలీసులను తిప్పలు పెట్టింది. స్టేషన్​లోనే చేతబడికి పాల్పడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇంట్లో తల్లి మృతదేహం.. గుడిలో యువతితో వివాహం... అసలు ఏమైందంటే?
    తల్లి శవాన్ని ఇంట్లో ఉంచుకుని పెళ్లి చేసుకున్నాడు ఓ కుమారుడు. తన తల్లి ఆఖరి తీర్చడం కోసమే ఇలా చేశానని అంటున్నాడు. ఇంతకీ ఈ కథెంటో.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందామా.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స!
    శ్రీలంక ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చినవేళ ప్రజాందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష రాజీనామా చేయాలంటూ ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాలు, ప్రజలు ఆయన నివాసాన్ని ముట్టడించగా... ఆయన పారిపోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధర.. నేటి లెక్కలు ఇలా..
    Gold Price Today: బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల పసిడి, కిలో వెండి ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కోహ్లీని ఎందుకు పక్కనపెట్టకూడదు?: కపిల్​ దేవ్​
    Kapil dev on Kohli Form: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ ప్రదర్శనపై షాకింగ్​ కామెంట్స్​ చేశాడు దిగ్గజ క్రికెటర్​ కపిల్​దేవ్​. టీ20ల నుంచి విరాట్​ ఎందుకు పక్కన పెట్టకూడదని ప్రశ్నించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'సీతారామం' ఇంటెన్స్​​ లుక్​.. దూసుకెళ్తున్న 'విక్రమ్​' మేకింగ్ వీడియో
    దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న 'సీతారామం' చిత్రం నుంచి బ్రిగేడియర్​గా నటిస్తున్న నటుడు సుమంత్​ లుక్​ వచ్చింది. మరోవైపు కమల్​హాసన్​ 'విక్రమ్'​ మేకింగ్​ వీడియో సోషల్​మీడియాలో దూసుకెళ్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.