ETV Bharat / bharat

'ఇకపై 50% ఫ్లైట్లనే నడపాలి'.. స్పైస్​జెట్​కు డీజీసీఏ షాక్

author img

By

Published : Jul 27, 2022, 5:33 PM IST

spicejet
spice jet

ఇకపై 8 వారాల పాటు స్పైట్​జెట్​ సంస్థ 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించింది. ఇటీవల తరచూ స్పైస్​జెట్​ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తిన నేపథ్యంలో వాటిని సమీక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్​జెట్​కు ఎదురుదెబ్బ తగిలింది. ఇక నుంచి ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం ఫ్లైట్లనే నడపాలని విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ ఆదేశించింది. స్పైస్​జెట్​ విమానాల్లో ఈ మధ్య తరచూ ఏదొక సాంకేతిక లోపం బయటపడుతుండటమే అందుకు కారణం.

అంతకుముందు ఈనెల 6న డీజీసీఏ స్పైస్​జెట్​కు షోకాజ్​ నోటీసులు జారీ చేసింది. జూన్​ 19 నుంచి ఎనిమిది సందర్భాల్లో ఆ సంస్థకు చెందిన విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీసీఏ స్పైస్​జెట్​పై చర్యలు చేపట్టింది. "సాంకేతిక సమస్యలను గుర్తించడం, తనిఖీలు, సేఫ్టీ మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని మరో 8 వారాల పాటు స్పైస్​జెట్​ కేవలం 50 శాతం విమానాలనే నడిపించాలని ఆదేశాలు జారీ చేశాం" అని డీజీసీఏ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇదీ చూడండి : మరో ఎంపీ సస్పెన్షన్.. పార్లమెంటులో ఆగని వాయిదాల పర్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.