ETV Bharat / bharat

డబ్బు ఆశతో క్షుద్రపూజలు, భార్యకు అందరిముందు నగ్నంగా స్నానం చేయించి

author img

By

Published : Aug 22, 2022, 6:14 PM IST

వ్యాపారంలో లాభాలు వస్తాయన్న ఆశతో అందరిముందు నగ్నంగా స్నానం చేయాలని భార్యపై ఒత్తిడి చేశాడు ఓ వ్యక్తి. అత్తమామలు సైతం ఒత్తిడి చేయడం వల్ల భర్త చెప్పినట్టే చేసింది ఆ మహిళ. మరోవైపు, గర్భిణీ అని చూడకుండా మహిళ కడుపులో తన్నారు అధికార పార్టీ కార్యకర్తలు.

police station
police station

భార్య మాన ప్రాణాలను కాపాడేందుకు ఏమైనా చేసే భర్తలను చూసుంటాం. కానీ ఇక్కడ మాత్రం తన స్వార్థం కోసం కట్టుకున్న భార్యను అందరి ముందర నగ్నంగా నిల్చోబెట్టాడు ఓ ప్రబుద్ధుడు. మహారాష్ట్ర పుణెలో జరిగిన ఈ ఘటనతో ఆ ప్రాంతా వాసులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు.

వివరాల్లోకి వెళ్తే..
వ్యాపారంలో లాభాలు చేరుకుని ఇంట సుఖశాంతులు నెలకొనాలంటే అఘోరీ పూజ చేయాలని ఎవరో చెప్పారని ఈ దుర్మాగానికి ఒడిగట్టాడు ఆ వ్యక్తి. దీనికి అతని తల్లిదండ్రులు సైతం సహకరించారు. దీంతో అతని ఆగడాలు మితిమీరిపోయాయి. ఏకంగా భార్యను అందరి ముందు నగ్నంగా స్నానం చేయాలని బలవంతం చేశాడు. భర్త ఒత్తిడికి తలొగ్గిన నిస్సహాయురాలైన భార్య.. చెప్పినట్టు ఆ పని చేసింది. చుట్టూ ఉన్నవారు సైతం దీన్ని చూస్తూ నివ్వెరపోయారే తప్ప ఎవరూ ఆ భర్తను ప్రశ్నించే ధైర్యం చేయలేదు.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఇందులో భాగస్వాములైన అతని తల్లిదండ్రులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. కాగా ఈ ఉదంతానికి సహకరించిన మాంత్రికుడు మాత్రం పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

గర్భిణీని కడుపులో తన్ని..
కోల్​కతాలోని నార్కేల్​డంగా ప్రాంతానికి చెందిన తృణముల్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే, కౌన్సిలర్​ అనుచరులు ఒక గర్భిణీని అతి క్రూరంగా కడుపులో తన్నారు. ఈ ఘటనపై పోలీసులు సైతం నోరు మెదపకపోవడం వల్ల బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే: నార్కేల్​డంగాకు చెందిన శివ్​ శంకర్​ దాస్​, అతని కుమారుడు దీపక్​ దాస్​ ఆ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టారు. విషయం తెలుసుకున్న తృణముల్​ కాంగ్రెస్​ కౌన్సిలర్​ స్వపన్​ సమద్దర్​.. వారిద్దరిని ఆదివారం తనను కలవమన్నాడు. దానికి వారు నిరాకరించడం వల్ల సాయంత్రం ఎమ్మెల్యే పరేష్​ పాల్​, కౌన్సిలర్​ అనుచరులు శివ్​ శంకర్​ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. తండ్రీ కొడుకులిద్దరిని ఘోరంగా చితకబాదారు. అంతేకాకుండా గర్భిణీగా ఉన్న దీపక్​ భార్యను సైతం విడిచిపెట్టలేదు. ఆమెను అతి దారుణంగా కడుపులో తన్ని గాయపరిచారని బాధితులు ఆరోపించారు.

బాధితురాలిని హుటాహుటిగా కోల్​కతా వైద్య కళాశాలకు తరలించారు. కడుపులో ఉన్న బిడ్డకు ఎటువంటి ప్రమాదం జరగలేదని వైద్యులు తెలిపారు. ఈ విషయం గురించి తనకు అసలు తెలియదని, తనకు దీనికి ఎటువంటి సంబంధం లేదని ఎమ్మెల్యే పరేష్​ పాల్​ చెప్పుకొచ్చారు. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం టీఎంసీ అనుచరులు దాడులు జరుపుతున్న సమయంలో వారు పోలీసులను ఆశ్రయించారని, కానీ పోలీసులు ఈ విషయంపై స్పందించకపోగా.. తమనే అరెస్ట్​ చేస్తామని బెదిరించారని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోల్​కతా పోలీసులు మాత్రం ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

కూలీ డబ్బుల కోసం వెళ్తే క్రూరంగా కొట్టి..
మహారాష్ట్రలోని సోలాపుర్​ మధా తాలుకుకు చెందిన ఓ కాంట్రాక్టర్ అతని వద్ద పని చేస్తున్న ఇద్దరు కార్మికులను అతి దారుణంగా కొట్టాడు. ఈ ఘటన భూతష్టే గ్రామంలో జరిగింది. ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతోంది. అందులో కార్మికులిద్దరి కాళ్లు, చేతులను కట్టేసి మరి కొడతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. బాధితుల్లో ఒకరి భార్య మాధా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయగా నిండితులైన బాలాజీ మోరే, అనంత్​ యాదవ్​తో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడ్డ కార్మికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వికాశ్​ బివా నాయక్​వాదీ, సేవక్​ కస్బే గత కొంత కాలంగా బాలాజీ మోరే వద్ద పని చేస్తున్నారు. ఆగస్ట్​ 15న వికాశ్​ కాంట్రాక్టర్​ దగ్గర నుంచి కూలీ డబ్బులు తెస్తానని తన భార్యకు చెప్పి వెళ్లాడు. రాత్రైనా అతను రాలేదని ఆమె ఆందోళన చెందింది. మరుసటి రోజు ఉదయం సందీప్​ లోవేటే అనే వ్యక్తి వికాస్ ఇంటికి వచ్చి అతని భార్యకు ఆ వీడియోను చూపించాడు. పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో.. కార్మికులను అతి క్రూరంగా కొట్టినవారిపై అట్రాసిటీ కేసును నమోదు చేశారు.

ఇదీ చదవండి:

రాంగ్ రూట్​లో వచ్చి స్కూల్​ వ్యాన్​ను ఢీకొట్టిన లారీ, నలుగురు విద్యార్థులు మృతి

14 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం, తీవ్రంగా కొట్టి, రోడ్డుపై వదిలేసి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.