రాంగ్ రూట్​లో వచ్చి స్కూల్​ వ్యాన్​ను ఢీకొట్టిన లారీ, నలుగురు విద్యార్థులు మృతి

author img

By

Published : Aug 22, 2022, 12:49 PM IST

Updated : Aug 22, 2022, 1:31 PM IST

Etv Bharat

మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిని జిల్లాలోని నగ్దా - ఉన్హేల్ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వన్తున్న ఒక లారీ,​ స్కూల్​ వ్యాన్​ను ఢీకొట్టగా అందులో ఉన్న విద్యార్థుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ మరో 11 మందిని చికిత్స కోసం ఉజ్జయినికి తరలించారు. మరోవైపు రాజస్థాన్​లో సీకార్​లో దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.

మధ్యప్రదేశ్​లోని ఉజ్జయిని జిల్లాలోని నగ్దా - ఉన్హేల్ రహదారి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారు మరణించారు. వేగంగా వన్తున్న ఒక లారీ..​ స్కూల్​ వ్యాన్​ను ఢీకొట్టగా అందులో ఉన్న విద్యార్థుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ మరో పదకొండు మందిని చికిత్స కోసం ఉజ్జయినికి తరలించారు.

వివరాల్లోకి వెళితే.. ఉజ్జయిని జిల్లాలోని నగ్దా ప్రాంతంలోనున్న ఒక కాన్వెంట్​ వ్యాన్​ పిల్లలతో సహా స్కూల్​కు బయలుదేరింది. మార్గ మధ్యలో తప్పు మార్గంలో వస్తున్న ఒక లారీ​ వారికి ఎదురుగా వచ్చి వ్యాన్​ను ఢీకొట్టింది. స్కూల్ వ్యాన్​ నుజ్జు నుజ్జు అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఆంబులెన్స్​ సేవలు సరిగా లేక విద్యార్థులను ఉజ్జయిని వైపు వెళ్తున్న బస్సులో చికిత్స కోసం తరలించారు.

దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా.
రాజస్థాన్​లోని సీకార్‌ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వీరంతా సలాసర్ క్షేత్రాన్ని సందర్శించి తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతులు హరియాణాలోని హిసార్‌ వాసులని పోలీసులు గుర్తించారు.

road accident
ప్రమాదం జరిగిన ప్రదేశం

వివరాల్లోకి వెళ్తే.. హిసార్ నుంచి కారులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సలాసర్ బాలాజీని చూసి తిరిగి వస్తున్నారు. ఇంతలో, బట్దానౌ గ్రామ సమీపంలో కంకరతో నిండిన ట్రాలీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఘటనపై స్థానికులు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకుని నలుగురి మృతదేహాలను ఆసుపత్రికి శవపరీక్ష కోసం తరలించారు.

road accident
ప్రమాదానికి గురైన కారు
ఇదీ చదవండి:

నీట మునిగి ఒకే కుటుంబంలో నలుగురు మృతి, ఆడుకోవడానికి వెళ్లి మరో ఏడుగురు పిల్లలు బలి

పాము కాటుతో ఐదేళ్ల చిన్నారి మృతి, తల్లిని కాపాడబోయి

Last Updated :Aug 22, 2022, 1:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.