టీడీపీ ప్రచారంలో పాల్గొన్నారని కత్తులతో దాడి - ఇద్దరికి తీవ్ర గాయాలు - YSRCP Mob Attack

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 2, 2024, 11:38 AM IST

thumbnail

YSRCP Mob Attack TDP Leaders in Visakha District : ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైఎస్సార్సీపీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రోజురోజూకు టీడీపీ నేతలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం గొల్లల తాళ్లవలసలో వైసీపీ వర్గీయులు, టీడీపీ కార్యకర్తలపై కత్తులతో దాడికి తెగబడ్డారు. టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారన్న అక్కసుతో వైఎస్సార్సీపీ వర్గీయులు వారిపై దాడికి పాల్పడ్డారు.

వైఎస్సార్సీపీ నేతల దాడిలో టీడీపీ కార్యకర్తలైన సూర్యనారాయణ, అప్పలరాజు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. స్థానికల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. దీంతో గ్రామంలో 144 సెక్షన్​ విధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వైఎస్సార్సీపీ నేత అప్పలనాయుడుతో పాటు అతని తండ్రి ఎర్రయ్య, సోదరులు రమణ, తోటయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.