ఇంటి స్థలం కోసం వినతిపత్రం సమర్పించినా పట్టించుకోలేదు- మోహిత్​ రెడ్డికి నిరసన సెగ - YSRCP Chevireddy campaing

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 6:42 PM IST

thumbnail

YSRCP Chevireddy Mohith Reddy campaing in Tirupati district : ఇంటింటి ప్రచారానికి వెళ్లిన చంద్రగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. తిరుపతి గ్రామీణ మండలం బ్రాహ్మణపట్టులో ప్రచారం చేస్తూ ఓ ఇంటి వద్దకు వెళ్లిన మోహిత్‌రెడ్డి కరపత్రమిచ్చి ఓటు వేయాలని కోరారు. మూడేళ్లుగా ఇంటి స్థలం కోసం వినతిపత్రం సమర్పించినా పట్టించుకోలేదని ఈ సందర్భంగా మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే వర్గానికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని మండిపడ్డారు. ఓ మహిళ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మోహిత్ రెడ్డి ఇబ్బంది పడ్డారు. 

Protest to YSRCP Chevireddy Mohith Reddy : ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీల వారు ప్రచారాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో పలువురు వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి నిరసన సెగ తగులుతోంది. ఐదేళ్ల పాలనలో ఏం చేశారని ప్రజలు వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. సమాధానం చెప్పలేని నాయకులు మొహం చాటేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.