హోటల్‌లో పేలిన కుక్కర్​ - మంటలు చెలరేగి యువతి సజీవ దహనం - FIRE ACCIDENT IN HOTEL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 5:03 PM IST

thumbnail

Hotel Fire Accident in Anantapur District : అనంతపురం జిల్లాలో ఘెర అగ్ని ప్రమాదం జరిగింది. కూడేరు మండలం జల్లిపల్లిలోని ఓ హోటల్​లో రైస్​ కుక్కర్​ పేలి సమీపంలో గ్యాస్​ సిలిండర్​ వరకు మంటలు వ్యాపించాయి. దీంతో ఒకసారిగా గ్యాస్​ సిలిండర్​ పేలి హోటల్లో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో ఓ యువతి సజీవ దహనమైంది. మృతి చెందిన యువతి హోటల్​ యజమాని కుమారై ప్రత్యూషగా (21) స్థానికులు గుర్తించారు. మంటల్లో సజీవ దహనం అయిన ప్రత్యూష బీఎస్సీ నర్సింగ్​ చదువుతుందని స్థానికులు తెలిపారు హోటల్​ యజమాని భార్య జ్యోతికి తీవ్ర గాయాలు అయ్యాయి.

హఠాత్తుగా హోటల్​ నుంచి మంటలు వ్యాపించడం స్థానికులు అప్రమత్తం అయ్యారు. హోటల్​ నుంచి ఎగిసిపడుతున్న మంటలను ఆర్పేందుకు స్థానికులు తీవ్రంగా శ్రమించారు. ఈ నేపథ్యంలోనే స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశారు. ఈ సంఘటనతో జల్లిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.