పవన్‌ని ఓడించేందుకు భారీగా నగదు బదిలీ చేస్తున్నారు: టీడీపీ నేత వర్మ - YCP Election Materials

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 3, 2024, 12:05 PM IST

thumbnail

YCP Election Materials Officers Tracking in Pithapuram : అనుమతులు లేకుండా వ్యాన్లో తరలిస్తున్న వైసీపీ ఎన్నికల సామగ్రిని, డమ్మీ ఈవీఎంలను ప్లయింగ్​ స్క్వాడ్​ అధికారులు పట్టుకున్నారు. కాకినాడ నుంచి తుని ప్రయాణిస్తున్న బోలెరో వాహనాన్ని తనిఖీ చేయగా భారీ మొత్తంలో జగన్​ మాస్కులు, టోపీలు, జెండాలను అధికారులు పట్టుకున్నారు. అనంతరం వ్యానుతో సహా సామగ్రిని పిఠాపురం పట్టణ పోలీసు స్టేషన్​కు అధికారులు తరలించారు. భారీగా తరలిస్తున్న సామగ్రిలో నగదు ఉందేమోనన్న అనుమానంతో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
 

పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్న వైసీపీ ఎన్నికల సామగ్రిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. వైసీపీ ఎన్నికల సామగ్రి పట్టుకుని నాలుగు గంటలు అయినా ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్లయిండ్​ స్క్వాడ్​ అధికారులు, పోలీసులను నిలదీశారు. ఎన్నికల సామగ్రి పేరుతో భారీగా డబ్బు కూడా తరలించే అవకాశం ఉందని ఆరోపించారు. మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత డబ్బు తరలిస్తున్నట్లు తమకు అనుమానం ఉందని వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్​ కల్యాణ్​ను ఓడించడానికి భారీ మొత్తంలో నగదు బదిలీ చేస్తున్నారనడానికి ఇదొక ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.