బల్లికురవ ఎస్సైపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళలు- ఉద్దేశపూర్వకంగానే టీడీపీ మద్దతుదారుడుపై కేసు నమోదు - Women Complained to SP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 26, 2024, 7:00 PM IST

thumbnail

Womens Complained to SP about SI Anarchy in Bapatla District: బాపట్ల జిల్లా బల్లికురవ మండలం ఉప్పుమాగులూరులో టీ దుకాణం వద్ద జరిగిన గొడవలో ఉద్దేశ పూర్వకంగానే టీడీపీ మద్దతుదారుడైన పిన్నేటి నాగరాజుపై కేసు నమోదు చేశారని బాధిత కుటుంబ సభ్యలు వాపోయారు. బల్లికురవ ఎస్సై నాగ శివారెడ్డిపై మహిళలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్సై అరాచకాలను, ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని మహిళలు తెలిపారు. టీడీపీ మద్దతు దారుడని చిన్న సమస్యను పెద్దదిగా చేసి నాగరాజుపై ఎక్కువ కేసులు పెడుతున్నారని మహిళలు తెలిపారు. గొడవకు సంబంధం లేని వారిని కూడా ఈ కేసు ఇరికిస్తున్నారని మహిళలు ఎస్పీకి చెప్పినట్లు తెలిపారు. 

అక్రమంగా కేసు పెట్టి ఇరికించారని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. సమగ్ర విచారణ జరిపి తప్పకుండా న్యాయం చేస్తానని ఎస్పీ హామీ ఇచ్చినట్లు మహిళలు పేర్కొన్నారు. వరుస ఘటనలతో ఎస్సై నాగ శివారెడ్డి తీరు వివాదాస్పదం కావడంతో ఆయనపై చర్యలు తీసుకునే ఆలోచనలో ఎస్పీ ఉన్నట్లు తెలుస్తుంది. వరుస ఘటనలతో ఎస్సైపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.