ప్రజలు కష్టాల్లో ఉన్నారు - చంద్రబాబు సీఎం కావాలి: రఘురామ - Raghurama Visited Tirumala Temple

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 24, 2024, 1:19 PM IST

thumbnail

Undi TDP Candidate Raghuramaraju Visited Tirumala Temple: సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కలియుగ దైవాన్ని కోరుకున్నట్లు ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. జగన్​పై గులకరాయి దాడి ఘటన ప్రజలు నవ్వుకునే పరిస్థితికి వచ్చిందని రఘురామకృష్ణ రాజు అన్నారు. గులకరాయి డ్రామా ఘటనతో వైఎస్సార్సీపీ ఇమేజ్ మరింత తగ్గిందన్నారు. 

"జూన్ నెల మొదటివారంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు కావాలని, కష్టాల నుంచి ప్రజలు బయటపడాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నాను. జగన్‌పై గులకరాయి దాడి ప్రజలు నవ్వుకునే పరిస్థితికి వచ్చింది." - రఘురామకృష్ణ రాజు, ఉండి టీడీపీ అభ్యర్థి 

కాగా ఈ నెల 5వ తేదీన పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో నిర్వహించిన ప్రజాగళం సభలో రఘరామకృష్ణరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి కూటమి అభ్యర్థిగా ఈనెల 22న రఘురామరాజు నామినేషన్ వేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.