గుడివాడకు జగన్ వస్తున్నారు- రోడ్లపై చెట్లు ఖతమైయ్యాయి! ఎండాకాలం వేళ ఈ నరకడం ఏంటంటున్న ప్రజలు - trees cutting for cm tour

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 13, 2024, 8:44 PM IST

thumbnail

Trees Cutting  In Gudivada Due to CM Tour : ముఖ్యమంత్రి పర్యటనలు రాష్ట్ర ప్రజలకు తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. ఆయన వస్తున్నారంటేనే జనాలు హడలెత్తిపోతున్నారు. సీఎం పర్యటన ఎక్కడైనా సరే చెట్లు నరకడం, దుకాణాలు, హోటళ్లు మూసివేయించడం కామన్​ అయిపోయింది. పరిసరాలు శుభ్రం చేసి మొక్కలు నాటాల్సింది పోయి పచ్చని చెట్లు నరికేస్తారు. భారీ వృక్షాలను జేసీబీలతో పెకలించేస్తారు. జగన్ పర్యటన అంటే పర్యావరణ విధ్వంసం మామూలుగా ఉండటం లేదు. తాజాగా కృష్ణా జిల్లా గుడివాడకు రేపు సీఎం రాక సందర్భంగా నగరంలో రోడ్లపై ఉన్న పచ్చని చెట్లను అధికారులు తొలగిస్తున్నారు. 

మేమంతా సిద్ధం పేరుతో ఆదివారం గుడివాడలో సీఎం బస్సు యాత్ర జరగనుంది. జగన్ రోడ్ షో నిర్వహించే ఏలూరు రోడ్డు వెంబడి ఉన్న చిన్న చెట్లను తొలగిస్తూ పెద్ద చెట్ల కొమ్మలను మున్సిపల్, విద్యుత్ శాఖ సిబ్బంది తొలగిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన అయితే ప్రజలను రక్షించే చెట్లను ఎలా తొలగిస్తారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలే వేసవికాలం ఎండ వేడికి తాళలేక చెట్టు నిడచాటున ఉండేందుకు కూడా వీలులేకుండా చేశారని పాదచారులు ఆవేదన చెందుతున్నారు. నీడ నిచ్చే చెట్లను తొలగిస్తుండడంతో చిరు వ్యాపారులు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.