చంద్రబాబుతోనే బీసీల అభ్యున్నతి : టీడీపీ నేత పుత్తా నరసింహా రెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 12:32 PM IST

thumbnail

TDP Leader Putta Narasimha Reddy Fire on YSRCP Government : బీసీల అభ్యున్నతి మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహా రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం అమరావతి కళ్యాణ మండపంలో జయహో బీసీ కార్యక్రమాన్ని (Jayaho BC Program) చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుత్తా నరసింహా రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

పుత్త నరసింహారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి పడకేసిందని అన్నారు. టీడీపీతోనే బీసీలకు సముచిత గౌరవం లభిస్తుందని తెలిపారు. పేదల సంక్షేమానికి టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన అనేక పథకాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికలకు ముందు సీఎం జగన్‌ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు.

Jayaho BC Program in YSR District : కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్​రెడ్డిపై మండిపడ్డ నరసింహారెడ్డి, ఎక్కడి నుంచో వచ్చిన దొంగలకు ఓట్లు వేస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని వక్స్ బోర్డ్ భూములు చుక్కల భూములను అన్నింటిని ఎమ్మెల్యే దోచుకుంటున్నాడని ఆరోపించారు. తాను దాదాపు ఇప్పటికే 85% ఇళ్లు తిరగాలని ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వందలాది కుటుంబాలు పార్టీలో చేరుతున్నాయని ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.