LIVE: గులకరాయి కేసులో రిమాండ్ రిపోర్ట్ సాక్షిగా వైసీపీ కుట్రలు - పట్టాభి మీడియా సమావేశం - Pattabhi ram live

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 12:25 PM IST

Updated : Apr 20, 2024, 12:42 PM IST

thumbnail

LIVE: సీఎం జగన్‌పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్‌సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన సతీష్‌ అలియాస్‌ సత్తిని నిందితుడిగా తేల్చారు. ఏ1గా సతీష్‌ను చూపించిన పోలీసులు ఏ2 ప్రోద్బలంతో జగన్​పైకి రాయి విసిరాడని చెబుతున్నారు. కానీ అలా ప్రోత్సహించిన వ్యక్తి ఎవరన్నదీ తేల్చకుండానే కోర్టుకు రిమాండ్‌ రిపోర్టు సమర్పించారు. నిందితుడికి మే 2 వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో ఎవరిని ఇరికించడానికి ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఏ2 ఏవరో? : సీఎంపై రాయి దాడి కేసులో వడ్డెరకాలనీకి చెందిన ఐదుగురిని ఈ నెల 16 తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సతీష్‌ తప్ప మిగిలిన నలుగురు మైనర్లు. మూడు రోజుల విచారణ అనంతరం సతీష్‌ అరెస్టును గురువారం మధ్యాహ్నం చూపించారు. సీఎంపైకి సతీష్‌ రాయి విసిరినట్లు పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ ఘటనకు ఏ2 సూత్రధారి అని చెబుతున్న పోలీసులు ఆ వ్యక్తి పేరును మాత్రం ఇందులో ప్రస్తావించలేదు.గులకరాయి కేసులో రిమాండ్ రిపోర్ట్ సాక్షిగా వైసీపీ కుట్రలు - టీడీపీ నేత పట్టాభి మీడియా సమావేశం

Last Updated : Apr 20, 2024, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.