వైసీపీ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తోంది: చింతమనేని ప్రభాకర్‌ - Chintamaneni Prabhakar Interview

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 7, 2024, 7:12 PM IST

thumbnail
వైసీపీ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తోంది: చింతమనేని ప్రభాకర్‌ (ETV Bharat)

TDP Leader Chintamaneni Prabhakar Interview: తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్​గా చెప్పుకునే అతికొద్ది మంది నేతల్లో ఆయనొకరు. దెందులూరు సీటు విషయంలో చివరి వరకూ ఉత్కంఠ కొనసాగడానికి ఆయనపై ఉన్న విమర్శలే కారణని కూడా చెబుతుంటారు. తన దూకుడుతోనే కష్టకాలంలో అటు పార్టీకి, ఇటు ప్రజల కోసం పనిచేశానని దెందులూరు కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ఆ దూకుడును తగ్గించుకునే ప్రసక్తే లేదని చింతమనేని ప్రభాకర్ అంటున్నారు. తన ప్రత్యర్థిగా ఉన్న అబ్బయ్య చౌదరి 2019లో ఫ్యాన్ గాలిలో గెలిచారని ఆయనకు ప్రజల మద్దతు లేదని ప్రభాకర్ అన్నారు. 

వైసీపీ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని చింతమనేని ప్రభాకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి అంతా వైసీపీ పాలనలోనే సాగిందని ఆయన విమర్శించారు. దాడుల సంస్కృతిని జగన్‌ ప్రోత్సహిస్తున్నారని చింతమనేని మండిపడ్డారు. కులాల మధ్య చిచ్చుపెట్టి జగన్​ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ప్రభాకర్​ వ్యాఖ్యానించారు. ప్రజలు వైసీపీ పాలనతో విసిగిపోయారని అందుచేతనే కూటమిని గెలిపించేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారని చింతమనేని ప్రభాకర్‌ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.