LIVE:ఎంపీ రఘరామ కృష్ణరాజు మీడియా సమావేశం- హైదరాబాద్ నుంచి ప్రత్యక్షప్రసారం - RAGHU RAMA LIVE FROM HYDERABAD
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 20, 2024, 1:13 PM IST
|Updated : Apr 20, 2024, 1:27 PM IST
Raghu Rama Krishna Raju Live From Vijayawada: నరసాపురం ఎంపీ కనుమూరి రఘరామ కృష్ణరాజు వచ్చే ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని టీడీపీ అధిష్ఠానం ఆదేశించినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే శివరామరాజులతో కలిసి పని చేసి, త్వరలో జరగబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తానని రఘరామ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల టీడీపీలో రఘరామ టీడీపీలో చేరారు. చంద్రబాబు ఈనెల 21న పార్టీ అభ్యర్థులకు బీఫారంలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 22న నామినేషన్ దాఖలు చేస్తానని రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. గులకరాయి డ్రామా ఘటనతో వైఎస్సార్సీపీ ఇమేజ్ మరింత తగ్గిందని నిన్న రచ్చబండ కార్యక్రమంలో రఘురామ అన్నారు. జగన్ను ఉంచాలా, ఇంటికి పంపించాలా అనే అంశంపై ఎన్నికలు జరుగుతున్నాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు సమావేశాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని రఘురామ కృష్ణ రాజు పేర్కొన్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి రఘరామ కృష్ణరాజు ప్రత్యక్షప్రసారం మీకోసం.