LIVE: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్- ప్రత్యక్షప్రసారం - Polling Started IN AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 7:00 AM IST

Updated : May 13, 2024, 7:54 PM IST

thumbnail

Polling Started for AP Elections 2024 Live: రాష్ట్ర భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లు లోక్‌సభ, అసెంబ్లీ బరిలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈవీఎంలు, ఇతర సామగ్రితో సిబ్బంది, ఆయా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. రీపోలింగ్‌ లేకుండా హింసరహిత పోలింగే లక్ష్యమన్న ఈసీ, గత ఎన్నికల కన్నా 10 వేల మంది కేంద్ర బలగాల్ని అదనంగా మోహరించింది. సార్వత్రిక ఎన్నికల నాలుగో విడతలో భాగంగా రాష్ట్రంలో, పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది, 175 శాసనసభ నియోజకవర్గాలకు 2వేల 387 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 4 కోట్ల 14 లక్షల 18 వందల 87 మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఇందులో 2 కోట్ల 3 లక్షల 39 వేల 851 మంది పురుష ఓటర్లు, 2 కోట్ల 10 లక్షల 58 వేల 615 మంది మహిళా ఓటర్లు, 3,421 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. వీరంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు, 46 వేల 389 కేంద్రాల్ని, ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. లక్షా 60 వేల ఈవీఎంలు వినియోగిస్తోంది. వాటి పనితీరును రెండుసార్లు పరిశీలించిన అధికారులు, జిల్లా కేంద్రాల నుంచి పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. కాగా ఏపీలో ప్రారంభమైన పోలింగ్ ప్రత్యక్షప్రసారం మీకోసం.

Last Updated : May 13, 2024, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.