ప్రైవేట్ బస్సులో నగదు తరలింపు - రూ.2.40కోట్లు సీజ్ చేసిన పోలీసులు - Police Seized Cash
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 2, 2024, 5:19 PM IST
Police Seized Huge Amount of Cash in East Godavari District: ఏపీలో ఎన్నికల సమీపిస్తున్న వేళ ఓ వైపు పార్టీలు ప్రచారాలు ముమ్మరం చేయగా, మరోవైపు కొన్ని పార్టీలు ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు తాయిలాలు పంచే ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే పలు చోట్ల అధికార పార్టీకి చెందిన వస్తువులను ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. అదే విధంగా చెక్పోస్టుల దగ్గర పోలీసులు తనిఖీలను పెంచారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున నగదు, బంగారం, అనుమతి లేకుండా తీసుకెళ్తున్న ఇతర విలువైన వస్తువులు పట్టుబడుతున్నాయి.
తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదును పోలీసులు సీజ్ చేశారు. గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్ జిల్లాల చెక్పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సును తనిఖీ చేశారు. అందులో తరలిస్తున్న రూ. 2.40 కోట్ల నగదును గుర్తించారు. దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు దేవరపల్లి సర్కిల్ సీఐ బాల సురేష్ బాబు తెలిపారు.