వైఎస్సార్సీపీకి ఓటమి భయం పట్టుకుంది: కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి - Vallabhaneni Balashauri

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 12:27 PM IST

thumbnail

NDA Candidate Vallabhaneni Balashauri Comment on YSRCP Government : ఎన్నికల్లో తనను ఎదుర్కొనే ధైర్యం లేక వైఎస్సార్సీపీ అడ్డదారులు తొక్కుతుందని మచిలీపట్నం కూటమి ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి విమర్శించారు. అందుకే కూటమి అభ్యర్థుల పేర్లను పోలి ఉన్న పేర్లు కలిగిన వారితో నామినేషన్లు వేయించారని బాలశౌరి మండిపడ్డారు. ఈ సందర్భంగా తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను బాలశౌరి తెలియజేశారు.

పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గల్లో ప్రతి గ్రామానికి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని బాలశౌరి హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్​ను పూర్తి చేసి రైతులకు రెండు పంటలకు సాగు నీరు ఇస్తామన్నారు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన తాను పోర్టు, మెడికల్​ కాలేజీ, గుడివాడ రైల్వే వంతెనలను అభివృద్ధి చేసినట్లు గుర్తు చేశారు. ఈ సారి నియోజక వర్గ ప్రజలు తనను గెలిపిస్తే పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలంటున్న కూటమి అభ్యర్థి బాలశౌరితో ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.