రాముడిని కాకుండా మోదీని పూజించాలనేది బీజేపీ నేతల సిద్ధాంతం : జీవన్ రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2024, 3:59 PM IST

thumbnail

MLC Jeevan Reddy About Modi : బీజేపీ విజయ సంకల్ప యాత్ర పేరుతో కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాముడికి, మోదీకి ఏం సంబంధముందని ప్రశ్నించారు. గుడిలో రాముడిని కాకుండా మోదీని పూజించాలనేది బీజేపీ నేతల సిద్ధాంతమని ఆరోపించారు. ఇవాళ గాంధీ భవన్​లో ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​తో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నేతలు దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారని ఆక్షేపించారు.

MLC Jeevan Reddy Comments on BJP : వికసిత్ భారత్‌ పెట్టుబడిదారుల కోసమేనని, అంబానీ, అదానీ కోసం వికసిత్ భారత్‌ తీసుకువచ్చారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేస్తే సోమరిపోతులు అవుతారంటున్నారని, అంబానీ, అదానీకి లోన్​లు రుణమాఫీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. బండి సంజయ్‌ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మాతృమూర్తిపై అనుచితంగా మాట్లాడిన సంజయ్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.