అవిగో ఎన్నికలు - ఇవిగో దొంగ ఓట్లు 'సమయం దగ్గరపడుతున్నా ఓటర్ల జాబితాలో తప్పులు'

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 12:28 PM IST

thumbnail

Mistakes in Voter List Anantapur District : ఎన్నికలు దగ్గరవుతున్నా గానీ ఓటర్ల జాబితాల్లో తప్పులు మాత్రం తగ్గడం లేదు. ఓటర్ల జాబితాలో తప్పులు కోకొల్లలుగా ఉన్నాయని స్థానికులు ఆరోపించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పోలింగు కేంద్రం 137లో 5 వందల 77 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 293 మంది కాగా మహిళలు 284 మంది ఓటర్లుగా ఉన్నారు. క్రమ సంఖ్య 261, 442, 462, 667లో ఉన్న ఓటర్లతో పాటు మరింత మంది మృతులనూ జాబితాలో (Voter List) అలాగే ఉంచారని స్థానికులు విమర్శించారు. 

అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమ సంఖ్య 334, 335లో త్రినాథ్ అనే వ్యక్తికి రెండు ఓట్లు కల్పించారన్నారు. క్రమ సంఖ్య 70, 71, 87, 88లలో ఉన్న ఓటర్లతో పాటు మరింత మంది ఓటర్లు స్థానికంగా లేక పోయినా వారిని ఓటర్లుగానే కొనసాగిస్తున్నారని ఆరోపించారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.