వరంగల్​ జిల్లాను ఐటీ హబ్​గా తీర్చిదిద్దుతాం - త్వరలోనే నగరానికి బహుళజాతి కంపెనీలు : మంత్రి శ్రీధర్​ బాబు

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2024, 7:53 PM IST

thumbnail

Minister Sridhar Babu Called Warangal District an IT Hub : వరంగల్​ జిల్లాను ఐటీ పారిశ్రామిక హబ్​గా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు స్పష్టం చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి స్కిల్​ యూనివర్సిటీలను ప్రారంభిస్తామని తెలిపారు. త్వరలోనే వరంగల్​ నగరంలో పెద్ద ఎత్తున పరిశ్రమలతో పాటు బహుళజాతి కంపెనీలను తీసుకువస్తామని అన్నారు. హైదరాబాద్​ తరహాలో వరంగల్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని తెలిపారు. 

Minister Sridhar Babu Visited Padmakshi Ammavari Temple : అంతకు ముందు హనుమకొండలోని పద్మాక్షి అమ్మవారిని మంత్రి శ్రీధర్​ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని, కోరిన కోరికలను తీర్చే పద్మాక్షి అమ్మవారిని ప్రతినిత్యం కుటుంబ సమేతంగా దర్శించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఆలయ పూజారులు ఇచ్చిన వినతిపత్రాన్ని తీసుకున్న మంత్రి, ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.